www.ntodaynews.com
ఆరు నెలలుగా తాగునీటి సమస్యలు
తెలంగాణ
ఆరు నెలలుగా తాగునీటి సమస్యతో గొడ్లవారిపల్లి వాసుల ఆవేదన
NTODAY NEWS: అన్నమయ్య జిల్లా, పుంగనూరు ప్రతినిధి రాఘవేంద్ర రాజు
పుంగనూరు నియోజకవర్గంలోని సదుం మండలం ఎర్రాతివారిపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని గొడ్లవారిపల్లి గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చింది. గత ఆరు నెలలుగా తాగునీటి కొరతతో ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ సమస్యపై పలుమార్లు గ్రామపంచాయతీ, సచివాలయ సిబ్బంది మరియు సంబంధిత అధికారులకు వినతిపత్రాలు సమర్పించినప్పటికీ ఎలాంటి పరిష్కారం లభించలేదని ఆరోపిస్తున్నారు. తాగునీటి కోసం దూరప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని, ముఖ్యంగా మహిళలు మరియు వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
తక్షణమే సమస్యను పరిష్కరించి గ్రామంలో కొత్త బోరు త్రవ్వించి తాగునీటి సరఫరా కల్పించాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అలాగే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
గ్రామ ప్రజల సమస్యను అధికారులు అత్యవసరంగా పరిగణించి తగిన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
#Punganur #AnnamayyaDistrict #SadumMandal #DrinkingWaterCrisis #VillageIssues #RuralProblems
Follow us on
Website
Facebook
Instagram
YouTube