ఈ నెల 20న మెడికల్ బంద్: కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన అసోసియేషన్
మంచిర్యాల :- ఆన్లైన్ ఫార్మసీల ద్వారా ప్రిస్క్రిప్షన్ లేకుండా మందుల విక్రయాలను నిరసిస్తూ, ఈ నెల 20వ తేదీన దేశవ్యాప్త మెడికల్ షాపుల బంద్కు పిలుపునిచ్చినట్లు మంచిర్యాల జిల్లా మెడికల్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. ఈ మేరకు సోమవారం జిల్లా కలెక్టర్ను కలిసి ఒక వినతిపత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు చంద్రశేఖర్ మరియు సుధాకర్ మాట్లాడుతూ, నిబంధనలకు విరుద్ధంగా ఆన్లైన్ ఫార్మసీల ద్వారా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు విక్రయిస్తుండటంతో యువత పెడదోవ పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల ప్రజల ఆరోగ్యానికి తీవ్ర ముప్పు వాటిల్లుతోందని అన్నారు.
కార్పొరేట్ సంస్థల ఆన్లైన్ వ్యాపార శైలిని నిరసిస్తూ ఈ నెల 20న జిల్లావ్యాప్తంగా మెడికల్ షాపులను పూర్తిగా మూసివేసి బంద్ను పాటించనున్నట్లు వారు స్పష్టం చేశారు. అయితే, ప్రజల అత్యవసర ఆరోగ్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని అత్యవసర సేవలు (Emergency Services) మాత్రం అందుబాటులో ఉంటాయని వారు కలెక్టర్కు వివరించారు.