శ్రీ రంగనాథ స్వామి వారిని దర్శించుకున్న నంద్యాల ఎంపీ
జూపాడుబంగ్లా మండలం తర్తూరు గ్రామంలో శ్రీ రంగనాథ స్వామి వారిని దర్శించుకున్న నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి
అనంతరం తర్తూరు గ్రామంలో అంతర్గత నిధులతో రూ.55 లక్షల వ్యయంతో, అలాగే భాస్కరపురం గ్రామంలో రూ.50 లక్షలతో నూతనంగా నిర్మించిన సిమెంట్ రోడ్లను అధికారులు, గ్రామ పెద్దలతో కలిసి ప్రారంభించడం జరిగింది.
గతంలో అధ్వాన స్థితిలో ఉన్న రోడ్లు ఇప్పుడు సిమెంట్ రోడ్లుగా మారడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి పని చేస్తోందనే దానికి ఇది ఒక స్పష్టమైన నిదర్శనం. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, ప్రజల సౌకర్యాలే మా ప్రాధాన్యత.
నంద్యాల పార్లమెంట్ను అన్ని రంగాలలో అభివృద్ధిపదంలో నడిపించడమే నా లక్ష్యం గా పయనిస్తున్నాను, ఆరోగ్య రంగం, స్వచ్ఛ భారత్ -స్వచ్ఛ నంద్యాల పార్లమెంట్ అభివృద్ధి దిశగా పయనిస్తున్నాము. అని తెలిపారు.