BREAKING
చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు
www.ntodaynews.com

సముద్రంలో ఆరుగురు మత్స్యకారులు గల్లంతు.. ఒకరు సురక్షితం

ఆంధ్రప్రదేశ్
/ విశాఖపట్నం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
06 Jul, 2026 - 06:03 AM
120 వీక్షణలు

 విశాఖపట్నం హార్బర్ నుంచి ఈ నెల 1వ తేదీన వేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారులు ప్రమాదానికి గురయ్యారు. సముద్రంలో అలల తాకిడికి వారి బోటు బోల్తాపడింది.

నిన్న మధ్యాహ్నం ప్రతికూల వాతావరణం కారణంగా తిరిగి ఇంటికి వస్తున్నట్లు మత్స్యకారులు తమ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అయితే ఆ తర్వాత వారితో సంబంధాలు తెగిపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు.

గల్లంతైన వారిలో ఆరుగురు విజయనగరం జిల్లా భోగాపురం ప్రాంతానికి చెందిన వారు కాగా, మరో మత్స్యకారుడు భీమిలి ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.

ఈ ప్రమాదంలో కారెకి చిన్న అనే మత్స్యకారుడు ప్రాణాలతో బయటపడ్డాడు. అతడిని కోస్ట్ గార్డ్ సిబ్బంది రక్షించి తమ బోటులో చికిత్స అందిస్తున్నారు.

ఇంకా గల్లంతైన మరో ఆరుగురు మత్స్యకారుల కోసం కోస్ట్ గార్డ్, మత్స్యశాఖ అధికారులు విస్తృతంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనతో మత్స్యకార కుటుంబాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.