సముద్రంలో ఆరుగురు మత్స్యకారులు గల్లంతు.. ఒకరు సురక్షితం
విశాఖపట్నం హార్బర్ నుంచి ఈ నెల 1వ తేదీన వేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారులు ప్రమాదానికి గురయ్యారు. సముద్రంలో అలల తాకిడికి వారి బోటు బోల్తాపడింది.
నిన్న మధ్యాహ్నం ప్రతికూల వాతావరణం కారణంగా తిరిగి ఇంటికి వస్తున్నట్లు మత్స్యకారులు తమ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అయితే ఆ తర్వాత వారితో సంబంధాలు తెగిపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు.
గల్లంతైన వారిలో ఆరుగురు విజయనగరం జిల్లా భోగాపురం ప్రాంతానికి చెందిన వారు కాగా, మరో మత్స్యకారుడు భీమిలి ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.
ఈ ప్రమాదంలో కారెకి చిన్న అనే మత్స్యకారుడు ప్రాణాలతో బయటపడ్డాడు. అతడిని కోస్ట్ గార్డ్ సిబ్బంది రక్షించి తమ బోటులో చికిత్స అందిస్తున్నారు.
ఇంకా గల్లంతైన మరో ఆరుగురు మత్స్యకారుల కోసం కోస్ట్ గార్డ్, మత్స్యశాఖ అధికారులు విస్తృతంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనతో మత్స్యకార కుటుంబాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.