BREAKING
పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి
www.ntodaynews.com

​ఎలాంటి షరతులు లేకుండా మొక్కజొన్నను వెంటనే కొనుగోలు చేయాలి

తెలంగాణ
/ మంచిర్యాల / హాజీపూర్
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
15 May, 2026 - 11:54 AM
115 వీక్షణలు

​ఎలాంటి షరతులు లేకుండా మొక్కజొన్నను వెంటనే కొనుగోలు చేయాలి: మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు డిమాండ్

​మంచిర్యాల/హాజీపూర్: రైతులు పండించిన మొక్కజొన్న పంటను ఎలాంటి కొర్రీలు పెట్టకుండా, షరతులు లేకుండా ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు డిమాండ్ చేశారు. శుక్రవారం హాజీపూర్ మండలంలోని గుడిపేట, సబ్బపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

​అనంతరం దివాకర్ రావు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు:

​ఎకరానికి 40 క్వింటాళ్లు సేకరించాలి: ప్రస్తుతం కొనుగోలు నిర్వాహకులు ఎకరానికి కేవలం 26 క్వింటాళ్లు మాత్రమే తీసుకుంటున్నారని, దీనివల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని మండిపడ్డారు. ఎలాంటి షరతులు లేకుండా ఎకరానికి 40 క్వింటాళ్ల చొప్పున కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

​అవినీతిపై ధ్వజం: కాంటా పూర్తయిన తర్వాత పంటను తరలించడానికి బ్యాగుకు రెండు రూపాయల చొప్పున వసూలు చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇలా డబ్బులు అడగడం పచ్చి అవినీతికి నిదర్శనమని అన్నారు.

​దళారుల దందా: ప్రభుత్వం పూర్తిస్థాయిలో కొనుగోలు చేయకపోతే, రైతులు గత్యంతరం లేక తక్కువ ధరకే దళారులకు అమ్ముకునే పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతును రాజును చేసిన బిఆర్ఎస్ హయాంకు, ప్రస్తుత కాంగ్రెస్ పాలనకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని ఎద్దేవా చేశారు.

​ఎమ్మెల్యేపై విమర్శలు: స్థానిక ఎమ్మెల్యే కొనుగోలు నిర్వాహకులతో కుమ్మక్కై రైతులను దోచుకుంటున్నారని ఆరోపించారు. ఉన్నతాధికారులు వెంటనే జోక్యం చేసుకొని రైతులకు న్యాయం చేయాలని, లేనిపక్షంలో రైతుల తరపున బిఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుందని హెచ్చరించారు.

​ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు బిఆర్ఎస్ కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు