అభివృద్ధి పనులను పర్యవేక్షస్తున్న ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య
NTODAY NEWS: ఏలూరు
అభివృద్ధి యజ్ఞంలో భాగంగానే అవసరమైన ప్రాంతాల్లో రహదారుల విస్తరణ పనులకు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నామని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. ఇదేలక్ష్యంతో భవిష్యత్తులో మరిన్ని రహదారుల నిర్మాణానికి దశలవారీగా చర్యలు చేపట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధి పనులను ఎమ్మెల్యే బడేటి చంటి పరుగులు పెట్టిస్తున్నారు. దీనిలో భాగంగానే నిత్యం రద్దీగా ఉండే స్థానిక తంగెళ్ళమూడి నుండి జంగారెడ్డిగూడెం వైపు వెళ్ళే రోడ్డుతో పాటూ, చింతలపూడి వైపు వెళ్ళే రోడ్డు విస్తరణా పనులు చివరిదశకు చేరుకున్నాయి. సోమవారం ఉదయం రోడ్డు విస్తరణా పనులను పరిశీలించిన ఆయన,,, అనంతరం ఆ ప్రాంతంలోని దుకాణ యజమానులతో స్వయంగా మాట్లాడారు. వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా వాహనాలు పార్కింగ్ చేసేలా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అవసరమైన ప్రాంతాల్లో రోడ్డు విస్తరణా పనులను శరవేగంగా ముందుకు తీసుకెళ్తున్నామన్నారు. ఇదేక్రమంలో తంగెళ్ళమూడి రోడ్డును నాలుగు లైన్ల రహదారిగా అభివృద్ధి చేస్తున్నామన్నారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube