ఎండలు మొదలయ్యాయంటే… ఏ పండు బెస్ట్?
ఎండలు మొదలయ్యాయంటే… ఏ పండు బెస్ట్?
ఎండాకాలం మొదలైతే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది పుచ్చకాయ. పుచ్చకాయ తింటే శరీరం చల్లబడుతుందని చాలా మంది భావిస్తారు. ఇది నిజమే. అయితే పుచ్చకాయకంటే ఇంకా ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు ఇచ్చే పండు ఉందని చాలా మందికి తెలియదు. అదే ఖర్బూజ (మస్క్ మెలన్). ఖర్బూజలో పుచ్చకాయ కంటే సుమారు మూడు రెట్లు విటమిన్ A ఉండటం వల్ల కళ్ల ఆరోగ్యం, చర్మానికి ఎంతో మేలు కలుగుతుంది. ఇందులో 90 శాతం నీరు ఉండటంతో శరీరాన్ని హైడ్రేట్గా ఉంచుతుంది. అలాగే విటమిన్ C సమృద్ధిగా ఉండటంతో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. తక్కువ కాలరీలు ఉండటం వల్ల బరువు నియంత్రణకు అనుకూలంగా ఉంటుంది. అధికంగా ఉన్న పొటాషియం గుండెపై ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. పుచ్చకాయ, ఖర్బూజ పండ్లను కలిపి ఫ్రూట్ సలాడ్గా తీసుకుంటే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.