BREAKING
నోయెల్ టాటా త్వరలో ఆర్‌బిఐతో టాటా సన్స్ హోదా గురించి చర్చించవచ్చు బీసీలకు 34 శాతం రిజర్వేషన్‌పై కూటమి నేతల విజయోత్సవ ర్యాలీ గుడిపాల మండలం బొమ్మసముద్రం వద్ద అక్రమ బియ్యం పట్టివేత హోటళ్లు, రెస్టారెంట్లలో కల్తీల కలకలం.. బయటి ఆహారంపై అప్రమత్తత అవసరం గుడిపాల మండలంలో అక్రమ ఇసుక తరలింపు.. ముగ్గురిపై కేసు బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చిన చిర్ల జగ్గిరెడ్డి చిత్తూరు లో నాణ్యతలేని అంగన్వాడి పాలు చిత్తూరు జిల్లా పరిధిలో యాదవ సంఘ నూతన కమిటీలు అధ్వానంగా మారిన నరిగపల్లి–తాళంబేడు రహదారి జగన్‌ను కలిసిన అమలాపురం కో-ఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్ నోయెల్ టాటా త్వరలో ఆర్‌బిఐతో టాటా సన్స్ హోదా గురించి చర్చించవచ్చు బీసీలకు 34 శాతం రిజర్వేషన్‌పై కూటమి నేతల విజయోత్సవ ర్యాలీ గుడిపాల మండలం బొమ్మసముద్రం వద్ద అక్రమ బియ్యం పట్టివేత హోటళ్లు, రెస్టారెంట్లలో కల్తీల కలకలం.. బయటి ఆహారంపై అప్రమత్తత అవసరం గుడిపాల మండలంలో అక్రమ ఇసుక తరలింపు.. ముగ్గురిపై కేసు బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చిన చిర్ల జగ్గిరెడ్డి చిత్తూరు లో నాణ్యతలేని అంగన్వాడి పాలు చిత్తూరు జిల్లా పరిధిలో యాదవ సంఘ నూతన కమిటీలు అధ్వానంగా మారిన నరిగపల్లి–తాళంబేడు రహదారి జగన్‌ను కలిసిన అమలాపురం కో-ఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్
www.ntodaynews.com

ఎన్నికల ఏర్పాట్లు వేగవంతం.. సామాజిక వర్గాల సర్వేపై అధికారుల దృష్టి

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Aug, 2026 - 09:45 PM
9 వీక్షణలు

ఎన్నికల ఏర్పాట్లు వేగవంతం.. సామాజిక వర్గాల సర్వేపై అధికారుల దృష్టి

ప్రతి ఇంటికీ వెళ్లి ఎస్సీ, ఎస్టీ, బీసీ జనాభా వివరాలు సేకరించాలి

తిరువూరు ఎంపీడీవో రవిబాబు ఆదేశాలు

ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అధికారులు ముందస్తు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. ఎన్నికల ప్రక్రియకు అవసరమైన చర్యలపై దృష్టి సారించిన అధికారులు క్షేత్రస్థాయిలో సర్వేలు, సమాచార సేకరణ చేపడుతున్నారు.

తిరువూరు మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో రవిబాబు పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ముందస్తు ఏర్పాట్లపై కార్యదర్శులకు పలు సూచనలు చేశారు.

గ్రామాల్లో చేపట్టనున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ జనాభా సర్వేను అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. ప్రతి ఇంటికీ వెళ్లి కుటుంబ సభ్యుల వివరాలను క్షుణ్ణంగా సేకరించాలని సూచించారు.

వివరాల నమోదు సమయంలో ఎలాంటి పొరపాట్లకు అవకాశం లేకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని, క్షేత్రస్థాయిలో సేకరించిన సమాచారాన్ని పూర్తిస్థాయిలో పరిశీలించి సకాలంలో ఉన్నతాధికారులకు అందజేయాలని తెలిపారు.

స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పంచాయతీ కార్యదర్శుల బాధ్యతలు, చేపట్టాల్సిన చర్యలపై ఎంపీడీవో అవగాహన కల్పించారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఇప్పటి నుంచే సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో తిరువూరు మండలంలోని పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.