ఎన్టీఆర్ 103వ జయంతి సందర్భంగా ఘన నివాళులు
ఏలూరు జిల్లా, చాట్రాయి మండలం చనుబండ శివారు సూరంపాలెం గ్రామంలో తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు స్వర్గీయ ఎన్టీఆర్ 103వ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో నూజివీడు నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షుడు మోరంపూడి శ్రీనివాసరావు పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం టీడీపీ నాయకులు, కార్యకర్తలు కలిసి ఎన్టీఆర్ సేవలను స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా మోరంపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎన్టీఆర్ తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచారని అన్నారు. పేద ప్రజల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను అమలు చేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు. రాజకీయాల్లో విలువలు, ప్రజాసేవకు ఎన్టీఆర్ ఆదర్శమని తెలిపారు. యువత ఎన్టీఆర్ ఆశయాలను ఆదర్శంగా తీసుకుని సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.