BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీపై ఏ.కొండూరు ఎంపీడీవో కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Apr, 2026 - 06:31 PM
126 వీక్షణలు

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీపై ఏ.కొండూరు ఎంపీడీవో కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం ఏ కొండూరు మండలంలోని 21 గ్రామపంచాయతీల పరిధిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీని సమయానికి పూర్తి చేయాలని మండల పరిషత్ అభివృద్ధి అధికారి బొజ్జగాని శ్రీనివాసరావు అధికారులకు ఆదేశించారు. గురువారం మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం నుంచి పంచాయతీ కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రతి నెల మాదిరిగానే ఉదయం 6 గంటల నుంచి 9 గంటలలోపు లబ్ధిదారులందరికీ పెన్షన్ సొమ్ము అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పెన్షన్ నగదును అత్యంత జాగ్రత్తగా నిర్వహిస్తూ, లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పంపిణీ చేయాలని తెలిపారు.

గ్రామాల్లో లబ్ధిదారులు ఎవరైనా అందుబాటులో లేకపోతే ముందస్తుగా సమాచారం ఇచ్చి, వారికి అసౌకర్యం కలగకుండా చూడాలని పేర్కొన్నారు. పెన్షన్ల పంపిణీ విషయంలో ఎటువంటి అలసత్వం ప్రదర్శించకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని ఆదేశించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో మండల స్థాయి అధికారులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.