ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీపై ఏ.కొండూరు ఎంపీడీవో కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీపై ఏ.కొండూరు ఎంపీడీవో కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం ఏ కొండూరు మండలంలోని 21 గ్రామపంచాయతీల పరిధిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీని సమయానికి పూర్తి చేయాలని మండల పరిషత్ అభివృద్ధి అధికారి బొజ్జగాని శ్రీనివాసరావు అధికారులకు ఆదేశించారు. గురువారం మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం నుంచి పంచాయతీ కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రతి నెల మాదిరిగానే ఉదయం 6 గంటల నుంచి 9 గంటలలోపు లబ్ధిదారులందరికీ పెన్షన్ సొమ్ము అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పెన్షన్ నగదును అత్యంత జాగ్రత్తగా నిర్వహిస్తూ, లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పంపిణీ చేయాలని తెలిపారు.
గ్రామాల్లో లబ్ధిదారులు ఎవరైనా అందుబాటులో లేకపోతే ముందస్తుగా సమాచారం ఇచ్చి, వారికి అసౌకర్యం కలగకుండా చూడాలని పేర్కొన్నారు. పెన్షన్ల పంపిణీ విషయంలో ఎటువంటి అలసత్వం ప్రదర్శించకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని ఆదేశించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్లో మండల స్థాయి అధికారులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.