BREAKING
ఎన్టీఆర్ జిల్లా – విస్సన్నపేట సామాజిక సేవకు అరుదైన గౌరవం విస్సన్నపేటలో హత్య కేసు ఛేదన… యాక్సిడెంట్‌గా మలచే యత్నం విఫలం విస్సన్నపేటలో ఆటోనగర్ ఏర్పాటుకు యూనియన్ అర్జీ ఈదురుగాలులతో రోడ్డుపై కూలిన చెట్టు మహబూబాబాద్ జిల్లాలో అగ్నిప్రమాదం.. రైతుకు భారీ నష్టం 600 మార్కులకు 597 మార్కులు.. వీరే తెలంగాణ రాష్ట్ర టాపర్లు మంగ్లీ సోదరుడి ఖాతాకు డబ్బులు.. కేసులో కొత్త మలుపు తల్లీకొడుకులు ఒకేసారి 10వ తరగతి పాస్… ప్రేరణగా నిలిచిన కథ 10th రిజల్ట్స్.. ట్విన్స్‌కు సేమ్ మార్కులు 600కి 599 మార్కులు సాధించిన జ్ఞానేశ్వరి.. డాక్టర్ కావాలన్న లక్ష్యం ఎన్టీఆర్ జిల్లా – విస్సన్నపేట సామాజిక సేవకు అరుదైన గౌరవం విస్సన్నపేటలో హత్య కేసు ఛేదన… యాక్సిడెంట్‌గా మలచే యత్నం విఫలం విస్సన్నపేటలో ఆటోనగర్ ఏర్పాటుకు యూనియన్ అర్జీ ఈదురుగాలులతో రోడ్డుపై కూలిన చెట్టు మహబూబాబాద్ జిల్లాలో అగ్నిప్రమాదం.. రైతుకు భారీ నష్టం 600 మార్కులకు 597 మార్కులు.. వీరే తెలంగాణ రాష్ట్ర టాపర్లు మంగ్లీ సోదరుడి ఖాతాకు డబ్బులు.. కేసులో కొత్త మలుపు తల్లీకొడుకులు ఒకేసారి 10వ తరగతి పాస్… ప్రేరణగా నిలిచిన కథ 10th రిజల్ట్స్.. ట్విన్స్‌కు సేమ్ మార్కులు 600కి 599 మార్కులు సాధించిన జ్ఞానేశ్వరి.. డాక్టర్ కావాలన్న లక్ష్యం
www.ntodaynews.com

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీపై ఏ.కొండూరు ఎంపీడీవో కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Apr, 2026 - 06:31 PM
22 వీక్షణలు

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీపై ఏ.కొండూరు ఎంపీడీవో కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం ఏ కొండూరు మండలంలోని 21 గ్రామపంచాయతీల పరిధిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీని సమయానికి పూర్తి చేయాలని మండల పరిషత్ అభివృద్ధి అధికారి బొజ్జగాని శ్రీనివాసరావు అధికారులకు ఆదేశించారు. గురువారం మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం నుంచి పంచాయతీ కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రతి నెల మాదిరిగానే ఉదయం 6 గంటల నుంచి 9 గంటలలోపు లబ్ధిదారులందరికీ పెన్షన్ సొమ్ము అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పెన్షన్ నగదును అత్యంత జాగ్రత్తగా నిర్వహిస్తూ, లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పంపిణీ చేయాలని తెలిపారు.

గ్రామాల్లో లబ్ధిదారులు ఎవరైనా అందుబాటులో లేకపోతే ముందస్తుగా సమాచారం ఇచ్చి, వారికి అసౌకర్యం కలగకుండా చూడాలని పేర్కొన్నారు. పెన్షన్ల పంపిణీ విషయంలో ఎటువంటి అలసత్వం ప్రదర్శించకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని ఆదేశించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో మండల స్థాయి అధికారులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.