BREAKING
ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి
www.ntodaynews.com

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీపై ఏ.కొండూరు ఎంపీడీవో కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Apr, 2026 - 06:31 PM
59 వీక్షణలు

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీపై ఏ.కొండూరు ఎంపీడీవో కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం ఏ కొండూరు మండలంలోని 21 గ్రామపంచాయతీల పరిధిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీని సమయానికి పూర్తి చేయాలని మండల పరిషత్ అభివృద్ధి అధికారి బొజ్జగాని శ్రీనివాసరావు అధికారులకు ఆదేశించారు. గురువారం మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం నుంచి పంచాయతీ కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రతి నెల మాదిరిగానే ఉదయం 6 గంటల నుంచి 9 గంటలలోపు లబ్ధిదారులందరికీ పెన్షన్ సొమ్ము అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పెన్షన్ నగదును అత్యంత జాగ్రత్తగా నిర్వహిస్తూ, లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పంపిణీ చేయాలని తెలిపారు.

గ్రామాల్లో లబ్ధిదారులు ఎవరైనా అందుబాటులో లేకపోతే ముందస్తుగా సమాచారం ఇచ్చి, వారికి అసౌకర్యం కలగకుండా చూడాలని పేర్కొన్నారు. పెన్షన్ల పంపిణీ విషయంలో ఎటువంటి అలసత్వం ప్రదర్శించకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని ఆదేశించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో మండల స్థాయి అధికారులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.