www.ntodaynews.com
ఎన్టీఆర్ జిల్లా – గంపలగూడెం పర్యటనలో చిన్నారుల అక్షరాభ్యాసం వేడుకగా మారిన దృశ్యం
ఆంధ్రప్రదేశ్
/
ఎన్టీఆర్
ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం పర్యటనలో భాగంగా గంపలగూడెం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం నందు చిన్నారులకు అక్షరాభ్యాసం కార్యక్రమం ఘనంగా జరిగింది.
ఆర్డీవో ఏ కుమార్ స్వయంగా పాల్గొని చిన్నారుల చేతుల్లో అక్షరాలు రాయిస్తూ విద్యారంభాన్ని ప్రారంభించడంతో అక్కడ వాతావరణం ఉత్సాహభరితంగా మారింది. చిన్నారుల ఆనందం, తల్లిదండ్రుల హర్షధ్వానాలు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో శాంసుందర్, ఐసీడీఎస్ సీడీపీఓ, అంగన్వాడీ టీచర్లు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. గ్రామంలో చిన్నారుల విద్యాభ్యాసానికి ఇది మంచి ప్రారంభంగా భావిస్తూ స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు.