BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 29 March 2026, 12:49 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కూటమి ప్రభుత్వంపై వైసిపి నేత నల్లగట్ల స్వామిదాస్ తీవ్ర విమర్శలు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Mar, 2026 - 12:49 PM
172 వీక్షణలు

కూటమి ప్రభుత్వంపై వైసిపి నేత నల్లగట్ల స్వామిదాస్ తీవ్ర విమర్శలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గ వైసిపి ఇన్‌చార్జ్ నల్లగట్ల స్వామిదాస్ కూటమి ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో బెల్ట్ షాపులు, గంజాయి, కొకైన్, ఇతర డ్రగ్స్ విచ్చలవిడిగా లభిస్తున్నాయని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో గంజాయి నిర్మూలన, బెల్ట్ షాపుల నియంత్రణ చేస్తామని చెప్పిన హామీలు అమలు కాలేదని విమర్శించారు.

తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ గతంలో పల్లెల్లో సమస్యలు, నిరుద్యోగ యువత బాధలను స్టేటస్ రూపంలో వెల్లడించారని, ఇప్పుడు బెల్ట్ షాపులపై మాట్లాడినా ప్రభుత్వం స్పందించడం లేదని అన్నారు. బెల్ట్ దుకాణాలపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పిన చంద్రబాబు మాటలు అమలులో కనిపించడం లేదని గుర్తుచేశారు.

ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ డ్రగ్స్ వ్యవహారంలో పట్టుబడ్డారని ఆరోపిస్తూ, రాష్ట్రంలో గంజాయి, బ్లేడ్ బ్యాచ్ ప్రభావం పెరిగిందన్నారు. పోలీస్ స్టేషన్లలోనే గంజాయి విక్రయాలపై ఆరోపణలు వచ్చినా చర్యలు లేవని విమర్శించారు.

మేనిఫెస్టోలో ఇచ్చిన 143 హామీలు అమలు కాలేదని, కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని స్వామిదాస్ అన్నారు. ప్రశ్నించే వారిపై, సోషల్ మీడియాలో తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్నారని విమర్శించారు.

రాష్ట్రంలో ల్యాండ్, మైనింగ్, వైన్ మాఫియాలు పెరిగాయని, శాంతిభద్రతల పరిరక్షణలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని, 20 నెలల్లోనే భారీగా అప్పులు చేశారని ఆరోపించారు.

రైతులకు గిట్టుబాటు ధరలు లేకపోవడం, కౌలు రైతులకు సంక్షేమ పథకాలు అందకపోవడం వల్ల ఇబ్బందులు పెరిగాయని పేర్కొన్నారు. గత 22 నెలల్లో 550 మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు.

ఎమ్మెల్యేలు, ఎంపీల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయని, అభివృద్ధి పనులు పక్కన పడిపోయాయని విమర్శించారు. ప్రజలకు రక్షకుడిగా ఉంటానన్న పవన్ కళ్యాణ్ ఈ సమస్యలపై స్పందించడం లేదని ప్రశ్నించారు.

ప్రభుత్వం అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేసిందని, ప్రజలు తగిన సమయంలో సమాధానం ఇస్తారని నల్లగట్ల స్వామిదాస్ హెచ్చరించారు.