www.ntodaynews.com
ఎన్టీఆర్ జిల్లా: విస్సన్నపేటలో టీడీపీ మేనిఫెస్టో దహనం – వైసీపీ నిరసన
ఆంధ్రప్రదేశ్
/
ఎన్టీఆర్
ఎన్టీఆర్ జిల్లా పరిధిలోని విస్సన్నపేట అంబేద్కర్ సర్కిల్ వద్ద నిరసన కార్యక్రమం జరిగింది.
తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ప్రతులను యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ నాయకులు దహనం చేశారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వంపై రెండేళ్ల పాలనను వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు కాలేదని ఆరోపించారు.
అలాగే పవన్ కళ్యాణ్ హామీల విషయంలో ప్రజలను మోసం చేశారని వైసీపీ నాయకులు విమర్శించారు.
ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.