BREAKING
రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం
www.ntodaynews.com

ఎన్టీఆర్ జిల్లాలో నకిలీ ఇన్స్టాగ్రామ్ ఖాతాలపై కలెక్టర్ హెచ్చరిక

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
18 Jun, 2026 - 09:34 AM
66 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లాలో కొంతమంది సైబర్ మోసగాళ్లు జిల్లా కలెక్టర్ పేరు ఉపయోగించి నకిలీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలు సృష్టించి ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ G. Lakshmi Sha తెలిపారు.

ఈ నకిలీ ఖాతాల ద్వారా ప్రజలను సంప్రదిస్తూ డబ్బు లేదా ఇతర ఆర్థిక ప్రయోజనాలు కోరుతున్నట్లు గుర్తించినట్లు కలెక్టర్ వెల్లడించారు. ఇలాంటి ఖాతాలను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని, వాటికి స్పందించవద్దని ప్రజలకు సూచించారు.

అలాగే వ్యక్తిగత వివరాలు, బ్యాంకు ఖాతా సమాచారం, ఓటీపీలు, పాస్‌వర్డ్లు వంటి సున్నితమైన సమాచారాన్ని ఎవరికీ వెల్లడించవద్దని హెచ్చరించారు. అధికారుల పేర్లతో వచ్చే సందేశాలు లేదా సోషల్ మీడియా ఖాతాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా వ్యవహరించాలని, అనుమానాస్పద సోషల్ మీడియా ఖాతాలు లేదా సందేశాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు లేదా సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.