BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

ఎన్టీఆర్ జిల్లాలో నకిలీ ఇన్స్టాగ్రామ్ ఖాతాలపై కలెక్టర్ హెచ్చరిక

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
18 Jun, 2026 - 09:34 AM
99 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లాలో కొంతమంది సైబర్ మోసగాళ్లు జిల్లా కలెక్టర్ పేరు ఉపయోగించి నకిలీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలు సృష్టించి ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ G. Lakshmi Sha తెలిపారు.

ఈ నకిలీ ఖాతాల ద్వారా ప్రజలను సంప్రదిస్తూ డబ్బు లేదా ఇతర ఆర్థిక ప్రయోజనాలు కోరుతున్నట్లు గుర్తించినట్లు కలెక్టర్ వెల్లడించారు. ఇలాంటి ఖాతాలను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని, వాటికి స్పందించవద్దని ప్రజలకు సూచించారు.

అలాగే వ్యక్తిగత వివరాలు, బ్యాంకు ఖాతా సమాచారం, ఓటీపీలు, పాస్‌వర్డ్లు వంటి సున్నితమైన సమాచారాన్ని ఎవరికీ వెల్లడించవద్దని హెచ్చరించారు. అధికారుల పేర్లతో వచ్చే సందేశాలు లేదా సోషల్ మీడియా ఖాతాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా వ్యవహరించాలని, అనుమానాస్పద సోషల్ మీడియా ఖాతాలు లేదా సందేశాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు లేదా సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.