www.ntodaynews.com
తొలి విడత శిక్షణ ముగింపు
తెలంగాణ
నూతన వార్డు సభ్యులకు తొలి విడత శిక్షణ ముగింపు సర్టిఫికెట్లు ప్రదానం
NTODAY NEWS: చిట్యాల
నల్గొండ జిల్లా చిట్యాల మండలం పరిధిలోని గ్రామాలకు నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యులకు నిర్వహించిన తొలి విడత శిక్షణ కార్యక్రమం శుక్రవారం విజయవంతంగా ముగిసింది. మండల పరిధిలోని ఉరుమడ్ల గ్రామ రైతు వేదికలో ఈ నెల 19 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించిన శిక్షణ తరగతులు గ్రామీణ పరిపాలనలో ప్రజాప్రతినిధుల పాత్రను బలోపేతం చేసే దిశగా సాగాయి.
శిక్షణలో ప్రధాన అంశాలు
గ్రామ పంచాయతీ వ్యవస్థ పనితీరు
అభివృద్ధి పథకాల అమలు విధానం
గ్రామ సభ నిర్వహణ విధానాలు
ఆర్థిక వ్యవహారాల నిర్వహణ
ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన
ప్రజా సమస్యల పరిష్కారంలో పారదర్శకత, బాధ్యతాయుత వ్యవహారం, ప్రజలతో సమన్వయం వంటి అంశాల ప్రాధాన్యతను ట్రైనర్ యూసుఫ్ వివరించారు.
శిక్షణ పూర్తిచేసుకున్న వార్డు సభ్యులకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. కార్యక్రమంలో మండల ఎంపీడీవో ఎస్పీ జయలక్ష్మి, ఎంఫీఓ అనుముల కోటేష్, ప్రజాప్రతినిధులు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.
#Chityal #Nalgonda #WardMembers #TrainingProgram #RuralDevelopment #TelanganaNews
Follow us on
Website
Facebook
Instagram
YouTube