ఎర్రగుంటపల్లిలో ఘనంగా టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
ఎర్రగుంటపల్లిలో ఘనంగా టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ఎర్రగుంటపల్లి గ్రామంలోని వాటర్ ట్యాంక్ సమీపంలో, కీ"శే" శ్రీ తాళ్లూరి సాంబశివ రెడ్డి విగ్రహం వద్ద ఈరోజు (29-03-2026) తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
తెలుగు వారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ 44వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది.
చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ ఆదేశాల మేరకు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు, అధ్యక్షురాలు శ్రీమతి తాళ్లూరి రాధా రాణి ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు అల్లు చెన్నారెడ్డి, ఎంపీటీసీ విజయభాస్కర్, వైస్ ప్రెసిడెంట్ వెంకటరెడ్డి, వై.వి. సత్యనారాయణ, నారా లోకేష్ యోజన ఫౌండేషన్ సోషల్ మీడియా ప్రతినిధులు, కురం నాగ దుర్గారావు, గారపాటి సత్యనారాయణ, అలవాల శంకర్ రెడ్డి, గోలి సత్యనారాయణరెడ్డి (తెలుగు యువత), వి. సత్యనారాయణ శాస్త్రి, టీవీ ఆర్టిస్ట్ వర్ర నాగరాజు, నీలి తాతారావు, ఉమ్మడి శ్రీను, కోటమర్తి రవి, కుప్పాల సోమయ్య, సాదరబోయిన వెంకటస్వామి, కురం రామారావు, బొల్లు వెంకటేశ్వరరావు తదితర కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
పార్టీ పట్ల తమ నిబద్ధతను వ్యక్తం చేస్తూ నాయకులు మాట్లాడుతూ, భవిష్యత్తులో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమం ఉత్సాహభరిత నినాదాలతో విజయవంతంగా ముగిసింది.