www.ntodaynews.com
దేశ పునర్నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
తెలంగాణ
దేశ పునర్నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి - ఏబీవీపీ నాగిరెడ్డి.
NTODAY NEWS: అన్నమయ్య జిల్లా
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్,(ABVP) అన్నమయ్య జిల్లా రాయచోటి శాఖ ఆధ్వర్యంలో, ఏబీవీపీ 77వ ఆవిర్భా దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక ప్రతిభా జూనియర్ కళాశాలలో సెమినార్ నిర్వహించడం జరిగినది, ఈ సందర్భంగా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ శివ గంగిరెడ్డి మాట్లాడుతూ, ఇనుప కండరాలు ఉక్కు నరాలు వజ్ర కరోరమైన మనసు గల యువత ఉంటే ఈ దేశ స్వరూపాన్ని మార్చేస్తారని అన్న స్వామి వివేకానంద కన్న కలలు నిజం చేయడం కోసం ఏబీవీపీ నిరంతరం పనిచేస్తుందని అన్నారు మరియు ఏబీవీపీ జిల్లా నాయకుడు జేపీ నాగిరెడ్డి మాట్లాడుతూ ఏబీవీపీ 1949 జూలై 9న ఢిల్లీలో ప్రారంభమైన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నేడు దేశంలోనే అతిపెద్ద విద్యార్థుల సమస్యగా అవతరించిందని అన్నారు జ్ఞానం శీలం ఏకతలే సాధనాలుగా జాతీయత ఊపిరిగా విద్యార్థి యువతను జాగృతం చేస్తూ సామాన్య విద్యార్థులను సైతం సేవా సంఘర్షణ సంస్కార వంతమైన లక్షణాలు కలిగిన నాయకులుగా మలుస్తూ నిరంతరం విద్యార్థుల సమస్యలపై పోరాటం చేస్తున్నటువంటి ఏకైక విద్యార్థి సంస్థ ఏబీవీపీ అన్నారు. జాతీయ పునర్నిర్మాణం లక్ష్యంగా చేసుకొని స్వామి వివేకానందుని స్ఫూర్తిగా తీసుకొని వివకానందుని మాట ఏబీవీపీ బాటగా మలుచుకొని ఈ దేశంలో విద్యారంగ సమస్యలపై అనుక్షణం పోరాటం చేస్తుందని అభిలాష అన్నారు విద్యారంగా సమస్యల పరిష్కారంతోపాటు దేశంలో ప్రకృతి వైపరీత్యాలు లేదా దేశ విద్రోహుల ద్వారా దేశానికి ఏమి నష్టం వాటిన దేశం కోసం మేమున్నామంటూ దేశ రక్షణ గేయంగా ఏబీవీపీ పని చేస్తుందని అన్నారు మరియు జగన్మోహన్ రెడ్డి మ్యాథ్స్ లెక్చరర్ మాట్లాడుతూ విద్యార్థుల విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలు పెంచుకోవాలని అన్నారు. ఏబీవీపీ విద్యార్థులు సమస్య కోసమే కాకుండా సమాజ సేవలో కూడా ముందుంటుందని చాలా సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో టౌన్ సెక్రటరీ పెసల విజయ్ మొదలైన విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube