www.ntodaynews.com
వెల్గటూర్లో ఉత్సాహంగా క్రికెట్ టోర్నమెంట్
తెలంగాణ
PACS చైర్మన్ మద్దుల గోపాల్ రెడ్డి జన్మదినం సందర్భంగా క్రీడాకారులకు జెర్సీల పంపిణీ
NTODAY NEWS: వెల్గటూర్
వెల్గటూర్లో ఉత్సాహంగా క్రికెట్ టోర్నమెంట్
వెల్గటూర్, ఫిబ్రవరి 27: వెల్గటూర్ మండల కేంద్రంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్కు క్రీడాకారుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఎండపల్లి మాజీ పీఏసీఎస్ (PACS) చైర్మన్ మద్దుల గోపాల్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని జెర్సీల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మేరుగు నరేష్ గౌడ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి, రాజక్కపల్లి క్రికెట్ జట్టు సభ్యులకు రూ.5,000 విలువైన జెర్సీలను అందజేశారు.
యువతలో క్రీడా స్ఫూర్తి పెంపొందించాలి
ఈ సందర్భంగా మేరుగు నరేష్ గౌడ్ మాట్లాడుతూ యువత సెల్ఫోన్లకు బానిసలు కాకుండా క్రీడల వైపు మళ్లాలని సూచించారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని, వాటిని సమానంగా స్వీకరించడమే నిజమైన క్రీడా స్ఫూర్తి అని తెలిపారు. టోర్నమెంట్ విజయవంతానికి గ్రామ సర్పంచ్ బండమీది కవితా గోపి, క్రీడాభిమాని బండారి రాజేందర్ అందిస్తున్న సహకారం అభినందనీయమన్నారు.
కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బొడ్డు సంతోష్, గోపతి నరేష్, వడుకాపురం రాజు, షాగాని శ్రీనివాస్ ప్రశాంత్, పత్తిపాక మనోహర్, పత్తిపాక సురేష్, దోరిశెట్టి సురేష్, పోతురాజుల శేఖర్, పోతురాజుల ప్రశాంత్, లాసెట్టి మహేష్, శేఖర్, శ్రీకాంత్, రాజు, తిరుపతి, అజయ్, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. క్రికెట్ జట్టు సభ్యులు మరియు క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
#Velgatoor #CricketTournament #PACSChairman #SportsPromotion #TelanganaNews
Follow us on
Website
Facebook
Instagram
YouTube