www.ntodaynews.com
రైతు భరోసా నిధులు వెంటనే విడుదల చేయాలి
తెలంగాణ
రైతు భరోసా నిధులు వెంటనే విడుదల చేయాలి: బీఆర్ఎస్ నాయకుల నిరసన
NTODAY NEWS: మంచిర్యాల, ప్రతినిధి వి. శ్రీనివాస్
రైతు భరోసా నిధులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల నియోజకవర్గంలోని దండేపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నడిపెల్లి విజిత్ కుమార్ నేతృత్వంలో రైతులు ఈ నిరసనలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇవ్వాల్సిన మూడు విడతల రైతు భరోసా నిధులను నిలిపివేసిందని ఆరోపించారు. వెంటనే ఆ నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు.
గతంలో మూడు ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే భరోసా అందించి మిగతా రైతులకు అన్యాయం జరిగిందని విమర్శించారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల లోపు రైతు భరోసా నిధులు పూర్తిగా విడుదల చేయని పక్షంలో మంచిర్యాల నియోజకవర్గ వ్యాప్తంగా కలెక్టరేట్ ముట్టడి చేపడతామని హెచ్చరించారు.
రైతుల హక్కుల కోసం పోరాడేందుకు బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఈ సందర్భంగా నాయకులు స్పష్టం చేశారు.
#Mancherial #RythuBharosa #BRSParty #FarmersProtest #TelanganaNews #NTodayNews
Follow us on
Website
Facebook
Instagram
YouTube