www.ntodaynews.com
భూభారతి రెవెన్యూ సదస్సును రైతులు సద్వినియోగం చేసుకోవాలి
తెలంగాణ
నాగినేనిపల్లి గ్రామంలో 17వ తేదీన భూభారతి రెవెన్యూ సదస్సును రైతులు సద్వినియోగం చేసుకోవాలి-- రెవెన్యూ ఇన్స్పెక్టర్ వెంకట్ రెడ్డి
NTODAY NEWS: బొమ్మలరామారం
17వ తారీకు మంగళవారం రోజున ఉదయం 8.00 గంటలకు నాగినేనిపల్లి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి -2025 రెవెన్యూ గ్రామసభను ఏర్పాటు చేయడం జరుగుతుందని అని మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ వెంకట్ రెడ్డి నేడు ఒక ప్రకటనలో తెలిపారు గ్రామంలో ఉన్న రైతులు భూ సమస్యలకు సంబంధించి ఏమైనా సమస్యలు కుష్కి, తరి, పట్టా,లావుణి, సీలింగ్, ప్రభుత్వ భూమి,భూదాన్,పోడు భూములు,వారసత్వం బాగా పంపకాలు,సాదా బైనామా కొనుగోలు,రిజిస్టార్ కొనుగోలు దానమిచ్చిన భూమి,గిఫ్ట్ డీడ్, ఓ ఆర్ సి,అసైన్మెంట్,కోర్టు ఉత్తర్వులు,38 ఇ,పాస్ బుక్ లో సర్వే నంబర్ మిస్సింగు,పేరు మార్పులు-చేర్పులు,మ్యాటేషన్ పెండింగ్,కోర్టు ఉత్తర్వులు అమలు,డిఎస్ పెండింగ్,పాస్ బుక్ లో ఉన్న సర్వే నంబర్ సవరణ,నిషేధిత జాబితాలో ఉన్న భూములు తొలగించడం, చేర్చడం,వారసత్వం,భూసేకరణ సమస్యలు,ఇతర సమస్యలు ఉన్న రైతులు గ్రామసభలో దరఖాస్తు చేసుకోగలరని గ్రామ రైతులను కోరారు భూభారతి రెవెన్యూ సదస్సుకు సంబంధించిన ఫారం గ్రామసభలో అందుబాటులో ఉంటుందని తెలిపారు. రైతులు దరఖాస్తుతో పాటు ఆధార్ కార్డ్ జిరాక్స్,పాత పాస్ బుక్ జిరాక్స్,మీ వద్ద ఉన్న డాక్యుమెంట్స్ ఉన్న వాటి జిరాక్స్ కాపీలు జతపరిచి గ్రామ సభలో ఏర్పాటు చేసిన కౌంటర్ లో ఇవ్వాలని తెలిపారు గ్రామంలో రెవిన్యూ సదస్సు ఉదయం 8.00 గంటల నుండి సాయంత్రం 5గంటల వరకు గ్రామపంచాయతి కార్యాలయం దగ్గర నిర్వహించడం జరుగుతుందని అని అన్నారు కావున ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు పాల్గొని సద్వినియోగం చేసుకోగలరు అని తెలిపారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube