BREAKING
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి పాలమూరు సమస్యలు.. బహిరంగ లేఖతో జేఏసీ వినతి త్రికోటేశ్వర స్వామి దర్శించుకున్న తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు కొండపర్వ లో సహజ వ్యవసాయంపై 3 రోజుల ఉచిత శిక్షణ దూపిశెట్టి వారి నూతన వస్త్ర వేడుకలు జీఎస్టీ అప్పిలేట్ ట్రైబ్యునల్ ప్రారంభం నేడు ఐదుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ప్రమాణస్వీకారం.. నూజివీడులో బుధవారం మంత్రి కొలుసు పార్థసారథి పర్యటన.. ఆదానికి ఎఫ్‌సీఐ సైలో కాంట్రాక్టులు.. దేశ ఆహార భద్రతకు ముప్పు కొండపర్వ వద్ద ప్రమాద ఘంటికలు.. రోడ్డుపై కుప్పకూలిన భారీ వృక్షం కొమ్మలు! ఇంటి పనుల విషయంలో మందలించడంతో యువతి ఆత్మహత్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి పాలమూరు సమస్యలు.. బహిరంగ లేఖతో జేఏసీ వినతి త్రికోటేశ్వర స్వామి దర్శించుకున్న తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు కొండపర్వ లో సహజ వ్యవసాయంపై 3 రోజుల ఉచిత శిక్షణ దూపిశెట్టి వారి నూతన వస్త్ర వేడుకలు జీఎస్టీ అప్పిలేట్ ట్రైబ్యునల్ ప్రారంభం నేడు ఐదుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ప్రమాణస్వీకారం.. నూజివీడులో బుధవారం మంత్రి కొలుసు పార్థసారథి పర్యటన.. ఆదానికి ఎఫ్‌సీఐ సైలో కాంట్రాక్టులు.. దేశ ఆహార భద్రతకు ముప్పు కొండపర్వ వద్ద ప్రమాద ఘంటికలు.. రోడ్డుపై కుప్పకూలిన భారీ వృక్షం కొమ్మలు! ఇంటి పనుల విషయంలో మందలించడంతో యువతి ఆత్మహత్య
www.ntodaynews.com

పుంగనూరులో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

తెలంగాణ
08 Mar, 2026 - 08:49 PM
215 వీక్షణలు
పుంగనూరులో అభివృద్ధి పనులకు శంకుస్థాపన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డితో కలిసి కార్యక్రమంలో పాల్గొన్న చల్లా బాబురెడ్డి NTODAY NEWS: పుంగనూరు ప్రతినిధి రాఘవేంద్రరాజు పుంగనూరు అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్‌లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డితో కలిసి పుంగనూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జి చల్లా రామచంద్రారెడ్డి (చల్లా బాబురెడ్డి) కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అగ్రికల్చర్ మార్కెట్‌లో సీసీ రోడ్లు మరియు షాపింగ్ రూముల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం స్థానిక వ్యాపారులతో సమావేశం నిర్వహించి మార్కెట్‌లో ఉన్న సమస్యలను తెలుసుకున్నారు. ఈ సమస్యలను త్వరలోనే ముఖ్యమంత్రి మరియు సంబంధిత మంత్రుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చూపుతామని చల్లా బాబురెడ్డి హామీ ఇచ్చారు. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. పుంగనూరులో చింతపండు వ్యాపారస్తుల సమస్యలపై చల్లా బాబురెడ్డి ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చం నాయుడుతో చర్చించి వ్యాపారస్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తామని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వంలో అక్రమాలకు తావు లేకుండా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని మంత్రి తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మద్దతుదారులను గెలిపించేందుకు కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఇంచార్జి వెంకటరమణ రాజు, మార్కెట్ యార్డ్ చైర్మన్ సెమీపతి మరియు డైరెక్టర్లు, ముస్లిం మైనారిటీ నాయకులు, తెలుగుదేశం పార్టీ మరియు కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. #Punganur #MandipalliRamprasadReddy #ChallaBabureddy #TDP #AnnamayyaDistrict #AndhraPradeshNews #NTodayNews Follow us on Website Facebook Instagram YouTube