PM Modi: సీషెల్స్ అత్యున్నత 'గార్డియన్ ఆఫ్ ది బ్లూ హారిజన్' పురస్కారం అందుకున్న ప్రధాని మోదీ
సీషెల్స్ | NTODAY NEWS
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సీషెల్స్ అధ్యక్షుడు వావెల్ రామ్కలావన్ ప్రతిష్ఠాత్మకమైన 'గార్డియన్ ఆఫ్ ది బ్లూ హారిజన్' (Guardian of the Blue Horizon) పురస్కారాన్ని ప్రదానం చేశారు. పర్యావరణ పరిరక్షణ, సముద్ర భద్రత, సుస్థిర అభివృద్ధి దిశగా భారత్ చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈ అత్యున్నత గౌరవాన్ని అందజేశారు.
పురస్కారాన్ని స్వీకరించిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, ఈ గౌరవాన్ని వాతావరణ మార్పుల సవాళ్లను ఎదుర్కొంటూ పర్యావరణ పరిరక్షణను భావితరాల పట్ల తమ బాధ్యతగా భావిస్తున్న ప్రపంచ దేశాలన్నింటికీ అంకితం చేస్తున్నట్లు తెలిపారు.
"వాతావరణ మార్పు అనేది ప్రపంచమంతా కలిసికట్టుగా ఎదుర్కొని అధిగమించాల్సిన అత్యంత కీలకమైన సవాలు. మన గ్రహాన్ని మరింత పచ్చగా, సుస్థిరంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రతి చర్య తీసుకోవడానికి భారత్ కట్టుబడి ఉంది" అని ప్రధాని పేర్కొన్నారు.
దేశీయంగా అమలు చేస్తున్న పర్యావరణహిత విధానాలతో పాటు, అంతర్జాతీయ సౌర కూటమి (International Solar Alliance), విపత్తు నిరోధక మౌలిక సదుపాయాల కూటమి (Coalition for Disaster Resilient Infrastructure - CDRI) వంటి అంతర్జాతీయ కార్యక్రమాల ద్వారా ప్రపంచ పర్యావరణ పరిరక్షణలో భారత్ తన అంకితభావాన్ని చాటుతోందని మోదీ తెలిపారు.