గేదెల దొంగలు అరెస్ట్
ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం పావులవారిగూడెం గ్రామ పరిధిలో గేదెల దొంగతనానికి పాల్పడిన నలుగురు ముద్దాయిలను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఫిబ్రవరి 26 రాత్రి సమయంలో కొబ్బరి తోటలో ఉన్న షెడ్డు నుండి రెండు గేదెలు, ఒక లేగదూడను దొంగిలించారని తిరుమలపాలెం గ్రామానికి చెందిన బోడ బ్రహ్మయ్య ఫిర్యాదు చేయడంతో ద్వారకాతిరుమల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది.
ఈ కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు సీసీ కెమెరా దృశ్యాలు, సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయినవారిలో మిడతా వెంకన్న, కడారి కృష్ణ, కడారి సురేష్, ఉప్పాటి సుబ్రహ్మణ్యం ఉన్నారు.
విచారణలో నిందితులు చెడు అలవాట్లకు బానిసై గేదెలను దొంగిలించినట్లు వెల్లడైంది.
ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ ఆదేశాల మేరకు, డీఎస్పీ శ్రావణ్ కుమార్ పర్యవేక్షణలో, భీమడోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ కృష్ణ ఆధ్వర్యంలో, ద్వారకాతిరుమల ఎస్ఐ సుధీర్ నేతృత్వంలో ఈ అరెస్టులు జరిగాయి.
కేసు దర్యాప్తులో పోలీసు సిబ్బంది లక్ష్మీనారాయణ, శివకృష్ణ, నాగార్జున, జయప్రకాశ్ బాబు సహకరించారు.