BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

గేదెల దొంగలు అరెస్ట్

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 Mar, 2026 - 02:13 PM
119 వీక్షణలు

ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం పావులవారిగూడెం గ్రామ పరిధిలో గేదెల దొంగతనానికి పాల్పడిన నలుగురు ముద్దాయిలను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఫిబ్రవరి 26 రాత్రి సమయంలో కొబ్బరి తోటలో ఉన్న షెడ్డు నుండి రెండు గేదెలు, ఒక లేగదూడను దొంగిలించారని తిరుమలపాలెం గ్రామానికి చెందిన బోడ బ్రహ్మయ్య ఫిర్యాదు చేయడంతో ద్వారకాతిరుమల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది.

ఈ కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు సీసీ కెమెరా దృశ్యాలు, సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయినవారిలో మిడతా వెంకన్న, కడారి కృష్ణ, కడారి సురేష్, ఉప్పాటి సుబ్రహ్మణ్యం ఉన్నారు.

విచారణలో నిందితులు చెడు అలవాట్లకు బానిసై గేదెలను దొంగిలించినట్లు వెల్లడైంది.

ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ ఆదేశాల మేరకు, డీఎస్పీ శ్రావణ్ కుమార్ పర్యవేక్షణలో, భీమడోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ కృష్ణ ఆధ్వర్యంలో, ద్వారకాతిరుమల ఎస్ఐ సుధీర్ నేతృత్వంలో ఈ అరెస్టులు జరిగాయి.

కేసు దర్యాప్తులో పోలీసు సిబ్బంది లక్ష్మీనారాయణ, శివకృష్ణ, నాగార్జున, జయప్రకాశ్ బాబు సహకరించారు.