www.ntodaynews.com
గౌరిగోపాల్ హాస్పిటల్ లో ఉచిత మెగా వైద్య శిబిరం
ఆంధ్రప్రదేశ్
/
కర్నూలు
గౌరిగోపాల్ హాస్పిటల్లో ఉచిత మెగా వైద్య శిబిరం
టీడీపీ కార్యకర్తలకు ఉచిత పరీక్షలు
కర్నూలులోని గౌరిగోపాల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఈ నెల 9వ తేదీన ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ శిబిరంలో కర్నూలు నియోజకవర్గానికి చెందిన టీడీపీ కార్యకర్తలకు రూ.10,000 విలువ చేసే వైద్య పరీక్షలను పూర్తిగా ఉచితంగా నిర్వహించనున్నారు.
ఆరోగ్య పరిరక్షణ దృష్ట్యా ఈ అవకాశాన్ని ప్రతి కార్యకర్త సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.
ఈ శిబిరం ద్వారా ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించి తగిన చికిత్స పొందే అవకాశం ఉంటుందని తెలిపారు.