BREAKING
సిఐ చిన్నమల్లయ్యని ఉద్యోగం నుండి శాశ్వతంగా డిస్మిస్ చేస్తూ ఐజి సర్వ శ్రేష్ట త్రిపాఠి ఉత్తర్వులు జారీ.. వెన్నుపోటుకు రెండేళ్లు: కూటమి వైఫల్యాలపై రేపటి నుంచి నిరసనలు లలిత ఆసుపత్రి ప్రారంభోత్సవంలో పాల్గొన్న: ప్రముఖ వైద్యులు కొమ్మినేని వీరశంకర్ రావు,డాక్టర్ రేష్మా డీఎస్సీ అభ్యర్థులకు అండగా నిలిచిన వైయస్ జగన్ నాగార్జున సాగర్ కాలువల నిర్వహణ పనులకు రూ.42.19 కోట్లు మంజూరు అభివృద్ధిలో ప్రజల్ని భాగస్వాముల్ని చేయండి : ప్రత్తిపాటి చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు పోస్టర్ ఆవిష్కరణ పల్నాడు జిల్లా స్పెషల్ బ్రాంచ్ సీఐగా సామినేని ఆంథోనీ రాజు బాధ్యతల స్వీకరణ.. యడ్లపాడులో ‘AI ఆధారిత సూపర్ నారి యాప్’ పై వీఓఏలకు శిక్షణ. అభివృద్ధిలో ప్రజల్ని భాగస్వాముల్ని చేయండి : ప్రత్తిపాటి సిఐ చిన్నమల్లయ్యని ఉద్యోగం నుండి శాశ్వతంగా డిస్మిస్ చేస్తూ ఐజి సర్వ శ్రేష్ట త్రిపాఠి ఉత్తర్వులు జారీ.. వెన్నుపోటుకు రెండేళ్లు: కూటమి వైఫల్యాలపై రేపటి నుంచి నిరసనలు లలిత ఆసుపత్రి ప్రారంభోత్సవంలో పాల్గొన్న: ప్రముఖ వైద్యులు కొమ్మినేని వీరశంకర్ రావు,డాక్టర్ రేష్మా డీఎస్సీ అభ్యర్థులకు అండగా నిలిచిన వైయస్ జగన్ నాగార్జున సాగర్ కాలువల నిర్వహణ పనులకు రూ.42.19 కోట్లు మంజూరు అభివృద్ధిలో ప్రజల్ని భాగస్వాముల్ని చేయండి : ప్రత్తిపాటి చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు పోస్టర్ ఆవిష్కరణ పల్నాడు జిల్లా స్పెషల్ బ్రాంచ్ సీఐగా సామినేని ఆంథోనీ రాజు బాధ్యతల స్వీకరణ.. యడ్లపాడులో ‘AI ఆధారిత సూపర్ నారి యాప్’ పై వీఓఏలకు శిక్షణ. అభివృద్ధిలో ప్రజల్ని భాగస్వాముల్ని చేయండి : ప్రత్తిపాటి
www.ntodaynews.com

గండ్రపల్లిలో వరుస మరణాలు కలకలం

తెలంగాణ
/ కరీంనగర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Mar, 2026 - 10:53 PM
66 వీక్షణలు

గండ్రపల్లిలో వరుస మరణాలు కలకలం  ‘కీడు’ భయంతో ఊరు ఖాళీ చేసిన గ్రామస్థులు

కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం గండ్రపల్లి గ్రామంలో గత మూడు నెలలుగా చోటుచేసుకున్న వరుస మరణాలు స్థానికంగా ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ కాలంలో మొత్తం 28 మంది వివిధ కారణాలతో మరణించినట్లు గ్రామస్థులు చెబుతున్నారు.

ఈ పరిణామాలతో భయాందోళనకు గురైన గ్రామ ప్రజలు, గ్రామానికి ఏదో ‘కీడు’ సోకిందనే నమ్మకానికి వచ్చారు. పురోహితుడి సూచన మేరకు గ్రామాన్ని ఒక రోజు పూర్తిగా ఖాళీ చేయాలని నిర్ణయించారు.

అందులో భాగంగా తెల్లవారుజామునే ఇళ్లకు తాళాలు వేసి, డప్పు చాటింపు ద్వారా గ్రామస్థులు అందరూ బయటకు వెళ్లి సమీప పొలాల్లో గడిపారు. అక్కడే ప్రత్యేకంగా ‘కీడు వంటలు’ నిర్వహించి గ్రామానికి పట్టిన పీడ తొలగుతుందని విశ్వసించారు.

ఇదిలా ఉండగా, తక్కువ వ్యవధిలో ఎక్కువ మరణాలు సంభవించడంపై అధికార యంత్రాంగం దృష్టి సారించాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. గ్రామంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి, మరణాలకు గల అసలు కారణాలను వెలికితీయాలని కోరుతున్నారు.