BREAKING
వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య
www.ntodaynews.com

గండ్రపల్లిలో వరుస మరణాలు కలకలం

తెలంగాణ
/ కరీంనగర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Mar, 2026 - 10:53 PM
105 వీక్షణలు

గండ్రపల్లిలో వరుస మరణాలు కలకలం  ‘కీడు’ భయంతో ఊరు ఖాళీ చేసిన గ్రామస్థులు

కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం గండ్రపల్లి గ్రామంలో గత మూడు నెలలుగా చోటుచేసుకున్న వరుస మరణాలు స్థానికంగా ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ కాలంలో మొత్తం 28 మంది వివిధ కారణాలతో మరణించినట్లు గ్రామస్థులు చెబుతున్నారు.

ఈ పరిణామాలతో భయాందోళనకు గురైన గ్రామ ప్రజలు, గ్రామానికి ఏదో ‘కీడు’ సోకిందనే నమ్మకానికి వచ్చారు. పురోహితుడి సూచన మేరకు గ్రామాన్ని ఒక రోజు పూర్తిగా ఖాళీ చేయాలని నిర్ణయించారు.

అందులో భాగంగా తెల్లవారుజామునే ఇళ్లకు తాళాలు వేసి, డప్పు చాటింపు ద్వారా గ్రామస్థులు అందరూ బయటకు వెళ్లి సమీప పొలాల్లో గడిపారు. అక్కడే ప్రత్యేకంగా ‘కీడు వంటలు’ నిర్వహించి గ్రామానికి పట్టిన పీడ తొలగుతుందని విశ్వసించారు.

ఇదిలా ఉండగా, తక్కువ వ్యవధిలో ఎక్కువ మరణాలు సంభవించడంపై అధికార యంత్రాంగం దృష్టి సారించాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. గ్రామంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి, మరణాలకు గల అసలు కారణాలను వెలికితీయాలని కోరుతున్నారు.