BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

గంజాయి గుట్టురట్టు నలుగురు ముఠా సభ్యుల అరెస్ట్..

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
11 Apr, 2026 - 04:15 PM
109 వీక్షణలు

గంజాయి' గుట్టురట్టు: నలుగురు ముఠా సభ్యుల అరెస్ట్..

రూ. లక్ష విలువైన గంజాయి స్వాధీనం.. అదనపు ఎస్పీ ఎం. వెంకటాద్రి వెల్లడి..

మదనపల్లె, ఏప్రిల్ 11: మదనపల్లె పరిసర ప్రాంతాల్లో గంజాయి సరఫరా చేస్తున్న ముఠా గుట్టును తాలూకా పోలీసులు రట్టు చేశారు. ఉల్లిపాయల లోడ్ కింద భారీ ఎత్తున గంజాయిని తరలిస్తున్న పాత కేసులో పరారీలో ఉన్న నలుగురు ముద్దాయిలను శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 1,00,000 విలువైన 4 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు, జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, జిల్లా అదనపు ఎస్పీ (పరిపాలన) శ్రీ ఎం. వెంకటాద్రి గారు మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.

*తనిఖీల్లో దొరికిపోయారు..*

జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, అదనపు ఎస్పీ ఎం. వెంకటాద్రి గారి (మదనపల్లి సబ్ డివిజన్ ఇంచార్జి) పర్యవేక్షణలో మదనపల్లె తాలూకా సీఐ కె. కళా వెంకటరమణ తన సిబ్బందితో కలిసి శనివారం ఉదయం బసినికొండ పంచాయతీ పరిధిలోని కనుమలో గంగమ్మ గుడి సమీపంలో వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో పుంగనూరు వైపు నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు దిగి, అనుమానాస్పదంగా నల్లటి కవర్లతో పారిపోవడానికి ప్రయత్నిస్తున్న ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలను పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు.

*పాత కేసులో పరారీలో ఉన్న నిందితులు:* మదనపల్లి తాలూకా పోలీస్ స్టేషన్‌లో గతంలో నమోదైన 179 కేజీల గంజాయి స్మగ్లింగ్ కేసు (Cr.No.49/2026) లో వీరంతా పరారీలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పట్టుబడిన వారిలో శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లు మండలానికి చెందిన మల్లెల మహేష్, మల్లెల అమరావతితో పాటు, పుంగనూరు పట్టణానికి చెందిన మల్లెల రాజమ్మ, మల్లెల చంటి ఉన్నారు. నిందితుల నుంచి 4 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకొని, వారిని రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో ప్రధానంగా గంజాయి విక్రయించిన మరో నిందితుడి కోసం గాలింపు ముమ్మరం చేసినట్లు అదనపు ఎస్పీ గారు తెలిపారు.

*యువత భవిష్యత్తును చిదిమేస్తే కఠిన చర్యలు:* ఈ సందర్భంగా అదనపు ఎస్పీ గారు మాట్లాడుతూ.. "జిల్లాలో గంజాయి సాగు, రవాణా, విక్రయాల మీద ఉక్కుపాదం మోపుతున్నాం. ముఖ్యంగా యువతను మత్తుకు బానిసలుగా మారుస్తున్న ముఠాలపై ప్రత్యేక నిఘా ఉంచాం. గంజాయి విక్రేతలపై పీడీ యాక్ట్ వంటి కఠిన చట్టాలను ప్రయోగిస్తాం" అని హెచ్చరించారు. జిల్లాను డ్రగ్స్ రహితంగా మార్చేందుకు ప్రజలు కూడా పోలీసులకు సహకరించాలని, అసాంఘిక కార్యకలాపాలపై సమాచారం అందించాలని కోరారు. సమర్థవంతంగా పనిచేసి నిందితులను పట్టుకున్న మదనపల్లె తాలూకా పోలీస్ స్టేషన్ సిబ్బందిని ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

👇

*అన్నమయ్య పోలీస్*