www.ntodaynews.com
గణపవరంలో ఈదురు గాలుల బీభత్సం
ఆంధ్రప్రదేశ్
/
పల్నాడు
ఆలయ ధ్వజస్తంభం కూలి, విద్యుత్ తీగలు కట్
NTODAY NEWS నాదెండ్ల మండలం: గణపవరం గ్రామం బొడ్రాయి సెంటర్లో రాత్రి వీచిన భారీ ఈదురు గాలులు తీవ్ర కలకలం రేపాయి. గాలుల ధాటికి స్థానిక గుడిలోని ధ్వజస్తంభం ఒక్కసారిగా విరిగి పక్కనే ఉన్న గోడపైకి ఒరిగిపోయింది. ఇదే సమయంలో ఆలయ ప్రాంగణంలోని కరెంటు తీగలు కూడా తెగి కిందపడటంతో ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ప్రమాద సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్ద ముప్పు తప్పింది. సమాచారం అందుకున్న విద్యుత్ అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు.