BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

గొల్లప్రోలులో చలివేంద్రం ప్రారంభం

ఆంధ్రప్రదేశ్
/ కాకినాడ / గొల్లప్రోలు
Reporter
బోరా శివారెడ్డి గొల్లప్రోలు మండల ప్రతినిధి
04 Jun, 2026 - 07:51 PM
97 వీక్షణలు

గొల్లప్రోలులో చలివేంద్రం ప్రారంభం --గుండ్ర సుబ్బారావు సేవా తత్పరత అభినందనీయం

గొల్లప్రోలు:ఎండ తీవ్రతతో అల్లాడుతున్న ప్రజల దాహార్తిని తీర్చేందుకు గొల్లప్రోలు ఇబీసీ (ఇబీసీ ) కాలనీలో ఏర్పాటు చేసిన చలివేంద్రం ఎంతో అభినందనీయమని స్థానికులు కొనియాడారు. ప్రముఖ సామాజిక కార్యకర్త, అపర భగీరథుడు, నిత్య సేవాధృక్పథం కలిగిన ప్రజా నాయకులు గుండ్ర సుబ్బారావు ఆధ్వర్యంలో ఈ చలివేంద్రాన్ని అత్యంత ఘనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా స్థానికులు, కాలనీ పెద్దలు మాట్లాడుతూ.. మంచితనానికి మారుపేరుగా, నిరుపేదల ఆశాజ్యోతిగా, నిత్య సేవాభావానికి నిలువెత్తు చిరునామాగా నిలిచే గుండ్ర సుబ్బారావు ఈ భానుడి భగభగలను సైతం లెక్కచేయకుండా, ప్రజల సంక్షేమమే పరమావధిగా ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టడం వారి హృదయ వైశాల్యానికి నిదర్శనమన్నారు. "మాటల్లో కాదు... చేతల్లో చూపే అసలైన ప్రజా నాయకుడు" అని నిరూపిస్తూ ఆయన చేసిన ఈ నిరుపమాన సేవ సమాజంలో ఎంతో మందికి దిక్సూచిగా, ఆదర్శంగా నిలుస్తుందని ఆకాశానికెత్తారు. తలచుకుంటేనే అల్లాడిపోయే ఈ వేసవి కాలంలో, ప్రజల దాహార్తిని తీర్చడం కంటే మిన్నయైన పుణ్యకార్యం మరొకటి లేదని, అలాంటి పవిత్ర కార్యాన్ని సుబ్బారావు తమ భుజస్కంధాలపై వేసుకుని విజయవంతం చేయడం వారి సేవా నిరతికి మచ్చుతునక అని కొనియాడారు.

ఈ అద్భుత కార్యక్రమంలో కాలనీ ప్రజలు, టిడిపి  నాయకులు, కార్యకర్తలు , పెద్ద సంఖ్యలో పాల్గొని, నిరంతరం ప్రజా శ్రేయస్సు కోసమే తపించే సుబ్బారావు కి హృదయపూర్వక ఘన కృతజ్ఞతలు మరియు సువర్ణ అభినందనలు తెలియజేశారు. ఆయన సేవా ప్రస్థానం ఇలాగే నిరంతరాయంగా కొనసాగాలని ప్రజల ఆకాంక్షించారు.