గొల్లప్రోలులో చలివేంద్రం ప్రారంభం
గొల్లప్రోలులో చలివేంద్రం ప్రారంభం --గుండ్ర సుబ్బారావు సేవా తత్పరత అభినందనీయం
గొల్లప్రోలు:ఎండ తీవ్రతతో అల్లాడుతున్న ప్రజల దాహార్తిని తీర్చేందుకు గొల్లప్రోలు ఇబీసీ (ఇబీసీ ) కాలనీలో ఏర్పాటు చేసిన చలివేంద్రం ఎంతో అభినందనీయమని స్థానికులు కొనియాడారు. ప్రముఖ సామాజిక కార్యకర్త, అపర భగీరథుడు, నిత్య సేవాధృక్పథం కలిగిన ప్రజా నాయకులు గుండ్ర సుబ్బారావు ఆధ్వర్యంలో ఈ చలివేంద్రాన్ని అత్యంత ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా స్థానికులు, కాలనీ పెద్దలు మాట్లాడుతూ.. మంచితనానికి మారుపేరుగా, నిరుపేదల ఆశాజ్యోతిగా, నిత్య సేవాభావానికి నిలువెత్తు చిరునామాగా నిలిచే గుండ్ర సుబ్బారావు ఈ భానుడి భగభగలను సైతం లెక్కచేయకుండా, ప్రజల సంక్షేమమే పరమావధిగా ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టడం వారి హృదయ వైశాల్యానికి నిదర్శనమన్నారు. "మాటల్లో కాదు... చేతల్లో చూపే అసలైన ప్రజా నాయకుడు" అని నిరూపిస్తూ ఆయన చేసిన ఈ నిరుపమాన సేవ సమాజంలో ఎంతో మందికి దిక్సూచిగా, ఆదర్శంగా నిలుస్తుందని ఆకాశానికెత్తారు. తలచుకుంటేనే అల్లాడిపోయే ఈ వేసవి కాలంలో, ప్రజల దాహార్తిని తీర్చడం కంటే మిన్నయైన పుణ్యకార్యం మరొకటి లేదని, అలాంటి పవిత్ర కార్యాన్ని సుబ్బారావు తమ భుజస్కంధాలపై వేసుకుని విజయవంతం చేయడం వారి సేవా నిరతికి మచ్చుతునక అని కొనియాడారు.
ఈ అద్భుత కార్యక్రమంలో కాలనీ ప్రజలు, టిడిపి నాయకులు, కార్యకర్తలు , పెద్ద సంఖ్యలో పాల్గొని, నిరంతరం ప్రజా శ్రేయస్సు కోసమే తపించే సుబ్బారావు కి హృదయపూర్వక ఘన కృతజ్ఞతలు మరియు సువర్ణ అభినందనలు తెలియజేశారు. ఆయన సేవా ప్రస్థానం ఇలాగే నిరంతరాయంగా కొనసాగాలని ప్రజల ఆకాంక్షించారు.