BREAKING
MRP కన్నా ఎక్కువ డబ్బులు అడిగితే కింద ఉన్న నెంబర్లకు కాల్ చేసి చెప్పండి ఒంటరి మహిళపై అత్యాచారం ఇద్దరు అన్నదమ్ముల అరెస్ట్ ప్రకాశం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన రేపు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య కొండవీడులో ప్రపంచ పర్యావరణ దినోత్సవం జాతీయ రహదారిపై నిలిచిపోయిన ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు చిలకలూరిపేట స్థానిక రైతు బజార్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేవవరంలో మొక్కల నాటకం పసుమరు గ్రామంలో హెచ్‌ఐవీ, సుఖవ్యాధులపై అవగాహన సదస్సు MRP కన్నా ఎక్కువ డబ్బులు అడిగితే కింద ఉన్న నెంబర్లకు కాల్ చేసి చెప్పండి ఒంటరి మహిళపై అత్యాచారం ఇద్దరు అన్నదమ్ముల అరెస్ట్ ప్రకాశం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన రేపు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య కొండవీడులో ప్రపంచ పర్యావరణ దినోత్సవం జాతీయ రహదారిపై నిలిచిపోయిన ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు చిలకలూరిపేట స్థానిక రైతు బజార్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేవవరంలో మొక్కల నాటకం పసుమరు గ్రామంలో హెచ్‌ఐవీ, సుఖవ్యాధులపై అవగాహన సదస్సు
www.ntodaynews.com

గొల్లప్రోలులో చలివేంద్రం ప్రారంభం

ఆంధ్రప్రదేశ్
/ కాకినాడ / గొల్లప్రోలు
Reporter
బోరా శివారెడ్డి గొల్లప్రోలు మండల ప్రతినిధి
04 Jun, 2026 - 07:51 PM
90 వీక్షణలు

గొల్లప్రోలులో చలివేంద్రం ప్రారంభం --గుండ్ర సుబ్బారావు సేవా తత్పరత అభినందనీయం

గొల్లప్రోలు:ఎండ తీవ్రతతో అల్లాడుతున్న ప్రజల దాహార్తిని తీర్చేందుకు గొల్లప్రోలు ఇబీసీ (ఇబీసీ ) కాలనీలో ఏర్పాటు చేసిన చలివేంద్రం ఎంతో అభినందనీయమని స్థానికులు కొనియాడారు. ప్రముఖ సామాజిక కార్యకర్త, అపర భగీరథుడు, నిత్య సేవాధృక్పథం కలిగిన ప్రజా నాయకులు గుండ్ర సుబ్బారావు ఆధ్వర్యంలో ఈ చలివేంద్రాన్ని అత్యంత ఘనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా స్థానికులు, కాలనీ పెద్దలు మాట్లాడుతూ.. మంచితనానికి మారుపేరుగా, నిరుపేదల ఆశాజ్యోతిగా, నిత్య సేవాభావానికి నిలువెత్తు చిరునామాగా నిలిచే గుండ్ర సుబ్బారావు ఈ భానుడి భగభగలను సైతం లెక్కచేయకుండా, ప్రజల సంక్షేమమే పరమావధిగా ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టడం వారి హృదయ వైశాల్యానికి నిదర్శనమన్నారు. "మాటల్లో కాదు... చేతల్లో చూపే అసలైన ప్రజా నాయకుడు" అని నిరూపిస్తూ ఆయన చేసిన ఈ నిరుపమాన సేవ సమాజంలో ఎంతో మందికి దిక్సూచిగా, ఆదర్శంగా నిలుస్తుందని ఆకాశానికెత్తారు. తలచుకుంటేనే అల్లాడిపోయే ఈ వేసవి కాలంలో, ప్రజల దాహార్తిని తీర్చడం కంటే మిన్నయైన పుణ్యకార్యం మరొకటి లేదని, అలాంటి పవిత్ర కార్యాన్ని సుబ్బారావు తమ భుజస్కంధాలపై వేసుకుని విజయవంతం చేయడం వారి సేవా నిరతికి మచ్చుతునక అని కొనియాడారు.

ఈ అద్భుత కార్యక్రమంలో కాలనీ ప్రజలు, టిడిపి  నాయకులు, కార్యకర్తలు , పెద్ద సంఖ్యలో పాల్గొని, నిరంతరం ప్రజా శ్రేయస్సు కోసమే తపించే సుబ్బారావు కి హృదయపూర్వక ఘన కృతజ్ఞతలు మరియు సువర్ణ అభినందనలు తెలియజేశారు. ఆయన సేవా ప్రస్థానం ఇలాగే నిరంతరాయంగా కొనసాగాలని ప్రజల ఆకాంక్షించారు.