www.ntodaynews.com
గూడూరులో ప్రీ-ప్రైమరీ సెక్షన్ల ప్రారంభం
తెలంగాణ
మహబూబాబాద్ జిల్లా గూడూరు ప్రాథమిక పాఠశాలలో 3 నుంచి 5 సంవత్సరాల వయస్సు గల చిన్నారుల కోసం ప్రీ-ప్రైమరీ సెక్షన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా గూడూరు ఎంఈఓ సుజాత చిన్నారులకు అక్షరాభ్యాసం నిర్వహించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ సెక్షన్లు ఏర్పాటు చేయడం వల్ల విద్యా వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని ఆమె తెలిపారు. గూడూరు మండలంలోని ఐదు పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ సెక్షన్లు ప్రారంభించినట్లు వెల్లడించారు. తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని చిన్నారులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో గూడూరు బాలుర పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సత్యనారాయణ, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాములు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.