BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

గ్రామాల్లో స్మశాన వాటికలు ఏర్పాటు చేయాలని డిమాండ్

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
13 Aug, 2026 - 06:04 AM
36 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండలం చండ్రుపట్ల, నరసాపురం గ్రామాల్లో రాష్ట్రవ్యాప్త సామాజిక శంఖారావం కార్యక్రమంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో సర్వే నిర్వహించారు.

ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు వి. నాగరాజు మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి 78 ఏళ్లు గడుస్తున్నా గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ స్మశాన వాటికలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఉన్న స్థలాలను చెరువులు, రహదారుల పక్కన వినియోగించుకోవాల్సి వస్తోందన్నారు. అనేక ప్రాంతాల్లో వీధిలైట్లు, రహదారులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

స్మశాన వాటికలు లేని గ్రామాల్లో ప్రభుత్వం వెంటనే స్థలాలు కొనుగోలు చేసి, బోరు, షెడ్లు తదితర కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలని నాగరాజు డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్తులో ఆందోళన చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో శ్రీను, రాము, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.