గ్రామాల్లో స్మశాన వాటికలు ఏర్పాటు చేయాలని డిమాండ్
ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండలం చండ్రుపట్ల, నరసాపురం గ్రామాల్లో రాష్ట్రవ్యాప్త సామాజిక శంఖారావం కార్యక్రమంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో సర్వే నిర్వహించారు.
ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు వి. నాగరాజు మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి 78 ఏళ్లు గడుస్తున్నా గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ స్మశాన వాటికలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఉన్న స్థలాలను చెరువులు, రహదారుల పక్కన వినియోగించుకోవాల్సి వస్తోందన్నారు. అనేక ప్రాంతాల్లో వీధిలైట్లు, రహదారులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
స్మశాన వాటికలు లేని గ్రామాల్లో ప్రభుత్వం వెంటనే స్థలాలు కొనుగోలు చేసి, బోరు, షెడ్లు తదితర కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలని నాగరాజు డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్తులో ఆందోళన చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో శ్రీను, రాము, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.