BREAKING
మంగళగిరి ఎయిమ్స్‌లో నాణ్యమైన వైద్యం – తక్కువ ఖర్చుతో సేవలు అన్నప్రసాదవితరణ పథకానికి విరాళం రూ. 1,00,000/-లను అందజేసిన ప్రమోద్ గుప్త, పూణే వాసి ఏప్రిల్ 21న శంకరజయంతి అన్న క్యాంటీన్లకు ఏటా రూ.50లక్షల విరాళం తాండూరు మండలంలో రోడ్డు ప్రమాదం - ఒకరు మృతి పెద్దకాపర్తిలో బచ్చు లుకేందర్ రెడ్డి పదవీ విరమణ వేడుక జనసేన జిల్లా కార్యదర్శి పగడాల రమణ గర్జన మదనపల్లె అమ్మ చెరువు మిట్టపై ఘోర రోడ్డు ప్రమాదం బాధిత కుటుంబాలకు అండగా ప్రభుత్వం నందిపేట్ లో ఘనంగా హిందూ సమ్మేళనం... మంగళగిరి ఎయిమ్స్‌లో నాణ్యమైన వైద్యం – తక్కువ ఖర్చుతో సేవలు అన్నప్రసాదవితరణ పథకానికి విరాళం రూ. 1,00,000/-లను అందజేసిన ప్రమోద్ గుప్త, పూణే వాసి ఏప్రిల్ 21న శంకరజయంతి అన్న క్యాంటీన్లకు ఏటా రూ.50లక్షల విరాళం తాండూరు మండలంలో రోడ్డు ప్రమాదం - ఒకరు మృతి పెద్దకాపర్తిలో బచ్చు లుకేందర్ రెడ్డి పదవీ విరమణ వేడుక జనసేన జిల్లా కార్యదర్శి పగడాల రమణ గర్జన మదనపల్లె అమ్మ చెరువు మిట్టపై ఘోర రోడ్డు ప్రమాదం బాధిత కుటుంబాలకు అండగా ప్రభుత్వం నందిపేట్ లో ఘనంగా హిందూ సమ్మేళనం...
www.ntodaynews.com

గర్భిణీలు, బాలింతలు అంగన్‌వాడీ సేవలను సద్వినియోగం చేసుకోవాలి

తెలంగాణ
Reporter
కూనురు మధు నల్గొండ జిల్లా ప్రతినిధి
08 Apr, 2026 - 12:15 PM
334 వీక్షణలు

గర్భిణీలు, బాలింతలు అంగన్‌వాడీ సేవలను సద్వినియోగం చేసుకోవాలి: కౌన్సిలర్ షబానా అజీమ్

నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 4వ  అంగన్‌వాడీ కేంద్రంలో బుధవారం 'ఆరోగ్య లక్ష్మి' కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక కౌన్సిలర్ షబానాఅజీమ్  హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ఆరోగ్య లక్ష్మి' పథకం కింద ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీ, బాలింత అంగన్‌వాడీ కేంద్రానికి వచ్చి పోషక విలువలతో కూడిన భోజనాన్ని తీసుకోవాలని కోరారు. తద్వారా తల్లీబిడ్డల ఆరోగ్యం మెరుగుపడుతుందని సూచించారు.3 నుండి 6 సంవత్సరాల వయస్సు గల పిల్లలందరి పేర్లను తప్పనిసరిగా అంగన్‌వాడీ కేంద్రాల్లో నమోదు చేయించాలి అని తెలిపారు.అంగన్‌వాడీల్లో నాణ్యమైన పూర్వ ప్రాథమిక విద్యతో పాటు, బలమైన పోషకాహారాన్ని ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. అనంతరం అంగన్వాడి కేంద్రంలోని చిన్న పిల్లలకు కౌన్సిలర్ చేతుల మీదుగా పండ్లను పంపిణీ చేశారు ​ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్‌వైజర్ ఎన్. సునీత, అంగన్‌వాడీ టీచర్ కె. మమత, ఆయా జలేదా, అలాగే వార్డులోని గర్భిణీలు, బాలింతలు , మహిళలు తదితరులు పాల్గొన్నారు.