BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

గర్భిణీలు, బాలింతలు అంగన్‌వాడీ సేవలను సద్వినియోగం చేసుకోవాలి

తెలంగాణ
Reporter
కూనురు మధు నల్గొండ జిల్లా ప్రతినిధి
08 Apr, 2026 - 12:15 PM
372 వీక్షణలు

గర్భిణీలు, బాలింతలు అంగన్‌వాడీ సేవలను సద్వినియోగం చేసుకోవాలి: కౌన్సిలర్ షబానా అజీమ్

నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 4వ  అంగన్‌వాడీ కేంద్రంలో బుధవారం 'ఆరోగ్య లక్ష్మి' కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక కౌన్సిలర్ షబానాఅజీమ్  హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ఆరోగ్య లక్ష్మి' పథకం కింద ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీ, బాలింత అంగన్‌వాడీ కేంద్రానికి వచ్చి పోషక విలువలతో కూడిన భోజనాన్ని తీసుకోవాలని కోరారు. తద్వారా తల్లీబిడ్డల ఆరోగ్యం మెరుగుపడుతుందని సూచించారు.3 నుండి 6 సంవత్సరాల వయస్సు గల పిల్లలందరి పేర్లను తప్పనిసరిగా అంగన్‌వాడీ కేంద్రాల్లో నమోదు చేయించాలి అని తెలిపారు.అంగన్‌వాడీల్లో నాణ్యమైన పూర్వ ప్రాథమిక విద్యతో పాటు, బలమైన పోషకాహారాన్ని ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. అనంతరం అంగన్వాడి కేంద్రంలోని చిన్న పిల్లలకు కౌన్సిలర్ చేతుల మీదుగా పండ్లను పంపిణీ చేశారు ​ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్‌వైజర్ ఎన్. సునీత, అంగన్‌వాడీ టీచర్ కె. మమత, ఆయా జలేదా, అలాగే వార్డులోని గర్భిణీలు, బాలింతలు , మహిళలు తదితరులు పాల్గొన్నారు.