గుడ్ ఫ్రైడే ఎఫెక్ట్… బూరుగుగూడెం కార్యక్రమానికి బ్రేక్!
గుడ్ ఫ్రైడే ఎఫెక్ట్… బూరుగుగూడెం కార్యక్రమానికి బ్రేక్!
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం బూరుగుగూడెం గ్రామంలో భారీగా జరగాల్సిన పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమానికి అకస్మాత్తుగా బ్రేక్ పడింది. మంత్రి కొలుసు పార్థసారథి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమైన ఈ కార్యక్రమం గుడ్ ఫ్రైడే సందర్భంగా వాయిదా వేయబడినట్లు అధికారులు ప్రకటించారు.
ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు, రైతులు పెద్ద ఎత్తున హాజరుకావడానికి సిద్ధమవుతుండగా, వాయిదా వార్తతో కొంత నిరాశ నెలకొంది. అయితే త్వరలోనే కొత్త తేదీ ప్రకటించి మరింత ఘనంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తామని అధికారులు భరోసా ఇస్తున్నారు.
చాట్రాయి తహశీల్దార్ బి. బద్రు మాట్లాడుతూ, “తదుపరి తేదీ, సమయంపై స్పష్టత ఇచ్చే వరకు రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు” అని తెలిపారు.