గుండెపోటుతో ప్రధానోపాధ్యాయుడు దారావత్ విప్లవ్ కుమార్ మృతి
చాట్రాయి మండలం పోతనపల్లి ఎం.పి.యు.పి. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు దారావత్ విప్లవ్ కుమార్ జూన్ 5న గుండెపోటుతో కన్నుమూశారు. స్కూల్ అసిస్టెంట్ (గణితం)గా విధులు నిర్వహిస్తూ ప్రధానోపాధ్యాయుడిగా అదనపు బాధ్యతలు చేపట్టిన ఆయన ఆకస్మిక మరణం ఉపాధ్యాయ వర్గాలను తీవ్ర విషాదంలో ముంచింది.ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నారు
విప్లవ్ కుమార్ మరణ వార్త తెలుసుకున్న చాట్రాయి మండల ఉపాధ్యాయులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన పార్ధివ దేహానికి ఎంఈవో-1 మాసగిరి శ్రీనివాస్, ఎంఈవో-2 బ్రహ్మాచారి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ పరంగా అందాల్సిన అన్ని సౌకర్యాలు, ఆర్థిక ప్రయోజనాలు కుటుంబానికి అందేలా చర్యలు తీసుకుంటామని ఎంఈవోలు హామీ ఇచ్చారు. విప్లవ్ కుమార్ సేవలను ఉపాధ్యాయులు, విద్యార్థులు స్మరించుకుంటూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.