BREAKING
మర్రిబంధం ఆర్సీఎం చర్చికి బొట్టు లక్ష్మణరావు అండ.. ప్రజలకు చెప్పేదాన్ని ముందుగా తానే ఆచరించే నాయకుడు పవన్ కళ్యాణ్ వివాదాస్పద ఎస్సై హరిప్రసాద్‌కు షాక్‌.. సర్వీస్ నుంచి డిస్మిస్‌..! బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్.. 6 నెలల్లో న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం..! ఇదేం గాలి దుమారం బాబోయ్.. గాల్లోకి ఎగిరిపోయిన వ్యక్తి.. షాద్‌నగర్ సర్కారు దవాఖానలో ఘోర నిర్లక్ష్యం.. కాన్పు తర్వాత కడుపులోనే సర్జికల్ ప్యాడ్..! కన్నతల్లే కసాయిగా మారిన ఘటన.. మెదక్‌లో శిశువు విక్రయం కలకలం దుగ్గొండి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ మెరుపుదాడి..! సింగరేణికి కొత్త కళ.. 9 కొత్త గనుల ప్రారంభానికి కసరత్తు మర్రిబంధం ఆర్సీఎం చర్చికి బొట్టు లక్ష్మణరావు అండ.. ప్రజలకు చెప్పేదాన్ని ముందుగా తానే ఆచరించే నాయకుడు పవన్ కళ్యాణ్ వివాదాస్పద ఎస్సై హరిప్రసాద్‌కు షాక్‌.. సర్వీస్ నుంచి డిస్మిస్‌..! బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్.. 6 నెలల్లో న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం..! ఇదేం గాలి దుమారం బాబోయ్.. గాల్లోకి ఎగిరిపోయిన వ్యక్తి.. షాద్‌నగర్ సర్కారు దవాఖానలో ఘోర నిర్లక్ష్యం.. కాన్పు తర్వాత కడుపులోనే సర్జికల్ ప్యాడ్..! కన్నతల్లే కసాయిగా మారిన ఘటన.. మెదక్‌లో శిశువు విక్రయం కలకలం దుగ్గొండి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ మెరుపుదాడి..! సింగరేణికి కొత్త కళ.. 9 కొత్త గనుల ప్రారంభానికి కసరత్తు
www.ntodaynews.com

గుంటూరులో పోస్టర్ ఫ్రీ సిటీపై కఠిన చర్యలు

ఆంధ్రప్రదేశ్
/ గుంటూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Apr, 2026 - 10:26 PM
18 వీక్షణలు

గుంటూరులో పోస్టర్ ఫ్రీ సిటీపై కఠిన చర్యలు

గుంటూరు, ఏప్రిల్ 30:

నగరాన్ని పరిశుభ్రంగా, ఆకర్షణీయంగా మార్చే లక్ష్యంతో గుంటూరు నగరపాలక సంస్థ “పోస్టర్ ఫ్రీ సిటీ” కార్యక్రమాన్ని కఠినంగా అమలు చేయడానికి చర్యలు ప్రారంభించింది.

జిల్లా కలెక్టర్, జీఎంసీ ప్రత్యేక అధికారి సాయికాంత్ వర్మ ఆదేశాల మేరకు కమిషనర్ కె. మయూర్ అశోక్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. నగరంలో అనధికార పోస్టర్లు, బ్యానర్లు, ఫ్లెక్సీలు తొలగించేందుకు 15 రోజుల ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు.

ఇప్పటికే పట్టణ ప్రణాళిక అధికారుల పర్యవేక్షణలో పలు ప్రాంతాల్లో వాల్ పోస్టర్లు, హోర్డింగ్స్ తొలగించారు. ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేయడానికి 12 ప్రత్యేక నిఘా బృందాలను నియమించారు.

కమిషనర్ హెచ్చరికలు:

అనుమతి లేకుండా పోస్టర్లు అంటిస్తే మొదటిసారి రూ.5 వేల జరిమానా

రెండోసారి రూ.10 వేల జరిమానా

మూడోసారి రూ.50 వేల జరిమానా, పోలీస్ కేసు నమోదు

గడువు తర్వాత పోస్టర్లు అంటించిన వారు స్వయంగా శుభ్రం చేసి పెయింటింగ్ చేయాలి

రోడ్లు, విద్యుత్ స్తంభాలు, డివైడర్లు, బ్రిడ్జిల గోడలు, కార్యాలయాల గోడలపై పోస్టర్లు, ఫ్లెక్సీలు కట్టే వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

అదేవిధంగా అనుమతి లేకుండా పోస్టర్లు, బ్యానర్లు ప్రింట్ చేసే ప్రింటింగ్ ప్రెస్‌లపై కూడా కేసులు నమోదు చేయనున్నట్లు తెలిపారు. ప్రతి ఫ్లెక్సీపై ప్రింటర్ వివరాలు తప్పనిసరిగా ఉండాలని, లేకపోతే ఇరువురిపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

రాత్రివేళల్లో పోస్టర్లు అంటించే వారిని పట్టుకోవడానికి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. నగర సుందరీకరణ కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని అధికారులు కోరారు.