BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

గ్యాస్ కొరతలో ఊరట.. ఏపీలో మళ్లీ కిరోసిన్ పంపిణీ ప్రారంభం

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
21 Mar, 2026 - 09:23 PM
171 వీక్షణలు

గ్యాస్ కొరతలో ఊరట.. ఏపీలో మళ్లీ కిరోసిన్ పంపిణీ ప్రారంభం 

అమరావతి : రాష్ట్రంలో గ్యాస్ కొరత నేపథ్యంలో ప్రజలకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకున్నారు. హార్ముజ్ జలసంధి వద్ద ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల ప్రభావంతో విశాఖపట్నానికి ఈ నెల 21న చేరాల్సిన గ్యాస్ నౌక 26న మాత్రమే చేరనున్నట్లు కేంద్రం సమాచారం అందించినట్టు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.

ఈ నేపథ్యంలో గ్యాస్ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతున్నాయని వెల్లడించారు.

ప్రస్తుతం ఏర్పడిన గ్యాస్ కొరత దృష్ట్యా కేంద్రం కేటాయించిన 2800 కిలో లీటర్ల కిరోసిన్‌ను వచ్చే సోమవారం నుంచి రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేయాలని నిర్ణయించారు. ముఖ్యంగా గిరిజన, గ్రామీణ ప్రాంతాల ప్రజలకు లీటరు చొప్పున కిరోసిన్ అందజేయనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.

ఈ నిర్ణయంతో గ్యాస్ కొరత వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలకు కొంతవరకు ఉపశమనం లభించనుంది.