గ్యాస్ కొరతలో ఊరట.. ఏపీలో మళ్లీ కిరోసిన్ పంపిణీ ప్రారంభం
గ్యాస్ కొరతలో ఊరట.. ఏపీలో మళ్లీ కిరోసిన్ పంపిణీ ప్రారంభం
అమరావతి : రాష్ట్రంలో గ్యాస్ కొరత నేపథ్యంలో ప్రజలకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకున్నారు. హార్ముజ్ జలసంధి వద్ద ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల ప్రభావంతో విశాఖపట్నానికి ఈ నెల 21న చేరాల్సిన గ్యాస్ నౌక 26న మాత్రమే చేరనున్నట్లు కేంద్రం సమాచారం అందించినట్టు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
ఈ నేపథ్యంలో గ్యాస్ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతున్నాయని వెల్లడించారు.
ప్రస్తుతం ఏర్పడిన గ్యాస్ కొరత దృష్ట్యా కేంద్రం కేటాయించిన 2800 కిలో లీటర్ల కిరోసిన్ను వచ్చే సోమవారం నుంచి రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేయాలని నిర్ణయించారు. ముఖ్యంగా గిరిజన, గ్రామీణ ప్రాంతాల ప్రజలకు లీటరు చొప్పున కిరోసిన్ అందజేయనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.
ఈ నిర్ణయంతో గ్యాస్ కొరత వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలకు కొంతవరకు ఉపశమనం లభించనుంది.