BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

గ్యాస్ కొరతలో ఊరట.. ఏపీలో మళ్లీ కిరోసిన్ పంపిణీ ప్రారంభం

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
21 Mar, 2026 - 09:23 PM
123 వీక్షణలు

గ్యాస్ కొరతలో ఊరట.. ఏపీలో మళ్లీ కిరోసిన్ పంపిణీ ప్రారంభం 

అమరావతి : రాష్ట్రంలో గ్యాస్ కొరత నేపథ్యంలో ప్రజలకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకున్నారు. హార్ముజ్ జలసంధి వద్ద ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల ప్రభావంతో విశాఖపట్నానికి ఈ నెల 21న చేరాల్సిన గ్యాస్ నౌక 26న మాత్రమే చేరనున్నట్లు కేంద్రం సమాచారం అందించినట్టు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.

ఈ నేపథ్యంలో గ్యాస్ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతున్నాయని వెల్లడించారు.

ప్రస్తుతం ఏర్పడిన గ్యాస్ కొరత దృష్ట్యా కేంద్రం కేటాయించిన 2800 కిలో లీటర్ల కిరోసిన్‌ను వచ్చే సోమవారం నుంచి రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేయాలని నిర్ణయించారు. ముఖ్యంగా గిరిజన, గ్రామీణ ప్రాంతాల ప్రజలకు లీటరు చొప్పున కిరోసిన్ అందజేయనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.

ఈ నిర్ణయంతో గ్యాస్ కొరత వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలకు కొంతవరకు ఉపశమనం లభించనుంది.