BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

గ్యాస్ లేకుండానే రోజూ 2 లక్షల పిల్లలకు భోజనం… బెంగళూరులో అద్భుత వంటశాల

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Mar, 2026 - 01:38 PM
150 వీక్షణలు

గ్యాస్ లేకుండానే రోజూ 2 లక్షల పిల్లలకు భోజనం… బెంగళూరులో అద్భుత వంటశాల

బెంగళూరు: దేశంలో వంట గ్యాస్ కొరతతో అనేక హోటళ్లు, వసతి గృహాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో, బెంగళూరులో ఒక వంటశాల మాత్రం గ్యాస్ సిలిండర్ లేకుండానే వేలాది మందికి భోజనం అందిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది.

అదమ్య చేతన అనే సేవా సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న ‘అన్నపూర్ణ కేంద్ర వంటశాల’ గత 18 ఏళ్లుగా పునరుత్పాదక ఇంధనంతోనే పనిచేస్తోంది. డా. తేజస్విని అనంత్‌కుమార్ సారథ్యంలో ఈ సేవా కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది.

ఈ వంటశాల ద్వారా ప్రతిరోజూ సుమారు 2 లక్షల మంది పాఠశాల పిల్లలకు మధ్యాహ్న భోజనం అందించడంతో పాటు, వేలాది మందికి అన్నదానం కూడా చేస్తున్నారు.

గ్యాస్ సిలిండర్లకు బదులుగా జీవ ఇంధనం, వ్యవసాయ వ్యర్థాలను వినియోగించడం ఈ వంటశాల ప్రత్యేకత. ధాన్యపు పొట్టు, గడ్డి, కొబ్బరి చిప్పలతో తయారైన గడ్డలను ఉపయోగించి పెద్ద బాయిలర్లలో ఆవిరి ద్వారా బియ్యాన్ని వండుతున్నారు.

విద్యుత్‌కు బదులుగా సౌర శక్తిని వినియోగిస్తున్నారు. వాడిన నీటిని మళ్లీ శుద్ధి చేసి మొక్కలకు ఉపయోగిస్తారు. బాయిలర్ శుభ్రం చేసిన నీటిని వడకట్టి వాహనాల శుభ్రతకు వినియోగిస్తున్నారు.

ఈ విధంగా ఈ వంటశాల చెత్తలేని కేంద్రంగా గుర్తింపు పొందింది. మొత్తం జీవ ఇంధన వినియోగం వల్ల ప్రతి సంవత్సరం సుమారు 12,500 గ్యాస్ సిలిండర్లను ఆదా చేస్తున్నట్లు సమాచారం.

మాజీ కేంద్ర మంత్రి అనంత్ కుమార్ జ్ఞాపకార్థంగా 1997లో ప్రారంభమైన ఈ సంస్థ ప్రస్తుతం మహిళల సాధికారత, ఆరోగ్య అవగాహన, పర్యావరణ పరిరక్షణ వంటి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

స్వీయ ఇంధనంతో స్వావలంబన సాధించిన ఈ వంటశాల నిజంగా అందరికీ స్ఫూర్తిదాయకం.