ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 316వ వర్ధంతి
NTODAY NEWS నల్గొండ జిల్లా:- చిట్యాల బహుజన రాజ్య స్థాపకుడు, మొగల్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన వీరయోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 316వ వర్ధంతిని చిట్యాలలో గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ 17వ శతాబ్దంలో మొగల్ పాలకుల నిరంకుశ పాలనలో సామాన్య ప్రజలు పడుతున్న కష్టాలను చూసి చలించిన పాపన్న గౌడ్, ఒక సామాన్యుడిగా ఉంటే ఈ మార్పు సాధ్యం కాదని గ్రహించారని కొనియాడారు. గీత కార్మికుడిగా ఉంటూనే సైన్యాన్ని సమీకరించి, గెరిల్లా పోరాటంతో గోల్కొండ కోటను సైతం స్వాధీనం చేసుకున్న ధీశాలి ఆయన అని గుర్తు చేసుకున్నారు. కుల మతాలకు అతీతంగా బీద, బిక్కి ప్రజలకు అండగా నిలిచిన వ్యక్తి పాపన్న గౌడ్ అని కొనియాడారు పాల్గొన్న ముఖ్య నాయకులు
ఈ కార్యక్రమంలో కనకదుర్గ అమ్మవారి గుడి చైర్మన్ మారగోని ఆంజనేయులు గౌడ్, గౌడ సంక్షేమ సంఘం అధ్యక్షులు మారగోని రమేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శి కునూరి శంకర్ గౌడ్, కోశాధికారి రేగుల గడ్డ నరసింహ గౌడ్, ఉపాధ్యక్షులు పంతంగి వెంకన్న గౌడ్, ఉయ్యాల మల్లేష్ గౌడ్, కాసుల సత్యనారాయణ గౌడ్ మేకల సురేష్ గౌడ్, గీత కార్మికుల అధ్యక్షుడు కునురి అంజయ్య గౌడు, ప్రధాన కార్యదర్శి కునూరి శంకర్ గౌడ్, కాసుల రాములు గౌడ్, పెద్దలు పుల్లెంల కోటయ్య గౌడ్, పొన్నం లక్ష్మయ్య గౌడు, దేశగొని బాలరాజు గౌడ్, బొడ్డు శంకర్ గౌడ్, అతిధులు పాటి మాధవ రెడ్డి, రంగా వెంకన్న, సిపిఐ, సిపిఎం పార్టీ నాయకులు మరియు నాతి శ్రీకాంత్ గౌడ్,కృష్ణా గౌడ్ తదితరులు పాల్గొన్నారు