BREAKING
గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం కోతి సమాధి వద్ద శ్రావణ శోభ,పోటెత్తిన భక్తజనం కొత్తపల్లె విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం కోతి సమాధి వద్ద శ్రావణ శోభ,పోటెత్తిన భక్తజనం కొత్తపల్లె విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు
Date of Publish : 02 April 2026, 07:16 pm
Posted by : కూనురు మధు

ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 316వ వర్ధంతి

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / చిట్యాల
02 Apr, 2026 - 07:16 PM
269 వీక్షణలు

NTODAY NEWS నల్గొండ జిల్లా:- చిట్యాల బహుజన రాజ్య స్థాపకుడు, మొగల్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన వీరయోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 316వ వర్ధంతిని చిట్యాలలో గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ ​కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ 17వ శతాబ్దంలో మొగల్ పాలకుల నిరంకుశ పాలనలో సామాన్య ప్రజలు పడుతున్న కష్టాలను చూసి చలించిన పాపన్న గౌడ్, ఒక సామాన్యుడిగా ఉంటే ఈ మార్పు సాధ్యం కాదని గ్రహించారని కొనియాడారు. గీత కార్మికుడిగా ఉంటూనే సైన్యాన్ని సమీకరించి, గెరిల్లా పోరాటంతో గోల్కొండ కోటను సైతం స్వాధీనం చేసుకున్న ధీశాలి ఆయన అని గుర్తు చేసుకున్నారు. కుల మతాలకు అతీతంగా బీద, బిక్కి ప్రజలకు అండగా నిలిచిన వ్యక్తి పాపన్న గౌడ్ అని కొనియాడారు ​పాల్గొన్న ముఖ్య నాయకులు

​ఈ కార్యక్రమంలో కనకదుర్గ అమ్మవారి గుడి చైర్మన్ మారగోని ఆంజనేయులు గౌడ్, గౌడ సంక్షేమ సంఘం అధ్యక్షులు మారగోని రమేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శి కునూరి శంకర్ గౌడ్, కోశాధికారి రేగుల గడ్డ నరసింహ గౌడ్, ఉపాధ్యక్షులు పంతంగి వెంకన్న గౌడ్, ఉయ్యాల మల్లేష్ గౌడ్, కాసుల సత్యనారాయణ గౌడ్ మేకల సురేష్ గౌడ్, గీత కార్మికుల అధ్యక్షుడు కునురి అంజయ్య గౌడు, ప్రధాన కార్యదర్శి కునూరి శంకర్ గౌడ్, కాసుల రాములు గౌడ్, పెద్దలు పుల్లెంల కోటయ్య గౌడ్, పొన్నం లక్ష్మయ్య గౌడు, దేశగొని బాలరాజు గౌడ్, బొడ్డు శంకర్ గౌడ్, అతిధులు పాటి మాధవ రెడ్డి, రంగా వెంకన్న, సిపిఐ, సిపిఎం పార్టీ నాయకులు మరియు నాతి శ్రీకాంత్ గౌడ్,కృష్ణా గౌడ్ తదితరులు పాల్గొన్నారు