ఘనంగా సుండిపెంటలో తెలుగుదేశం పార్టీ @44 వ దినోత్సవ వేడుకలు
ఘనంగా తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు.
నంద్యాల జిల్లా
శ్రీశైలం టౌన్
ఆవిర్భావ దినోత్సవం వేడుకలో హవా
పెద్ద సంఖ్యలో పాల్గొన్న టిడిపి నాయకులు, కార్యకర్తలు. అభిమానులు
శ్రీశైలం ప్రాజెక్ట్ లో అంబరాన్ని అంటే విధంగా ఆవిర్భావ దినోత్సవం.
శ్రీశైలం,కొత్తపేట, ఎస్సీ కాలనీ, సుండిపెంట వారు మెయిన్ రోడ్ వారు శ్రీశైలం ప్రాజెక్ట్ లో తెలుగుదేశం పార్టీ జండా ఆవిష్కరణ .
ఐక్యంగా పనిచేసే పార్టీని మరింత బలోపేతం చేయాలని శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు.కార్యకర్తే అధినేత గా TDP పయనిస్తుందని అన్నారు.
టిడిపి నాయకులు, కార్యకర్తలు మధ్య ఉత్సాహంగా సాగిన టిడిపి పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు.
నంద్యాలజిల్లా శ్రీశైలం నియోజకవర్గం సున్నిపెంట లో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం పార్టీ నాయకులు ఐనో లు వెంకటేశ్వర్లు కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సుండిపెంట వెస్ట్రన్ కాలనీ లో NTR విగ్రహం కీ పూలమాలలు వేసి బయలుదేరి , అనంతరం జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ స్థాపన నుంచి ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం కృషి చేస్తూ వస్తుందని తెలిపారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. గ్రామాలలో పార్టీ మరింత బలంగా నిలబడడానికి కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని సూచించారు. ప్రజలకు ఏ సమస్య వచ్చిన, ఏ కష్టం వచ్చినా టిడిపి పార్టీ ఆఫీస్ 24/7 ప్రజలకు ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో వేడుకలు నిర్వహిస్తున్నారని,తెలుగుదేశం పార్టీ 1982 మార్చి 29న నందమూరి తారక రామారావు (NTR) చేత స్థాపించబడిందని తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం స్థాపించిన ఈ పార్టీ, ప్రతి ఏటా మార్చి 29న ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటుం దని 2026 నాటికి ఈ పార్టీ 44వ ఆవిర్భావ వేడుకలను (44 ఏళ్లు పూర్తి) చేసుకున్నట్లు తెలిపారు. అనంతరం పార్టీ నాయకుడు, కార్యకర్తలు, స్వీట్లు ఆత్మీయంగా ఒకరికొకరు తినిపించుకున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీశైలం టౌన్ అధ్యక్షులు ,టీడీపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు