BREAKING
సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
Date of Publish : 03 March 2026, 10:45 am
Posted by : NTODAY NEWS OFFICIAL

మహిళాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట

తెలంగాణ
03 Mar, 2026 - 10:45 AM
172 వీక్షణలు
మహిళాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట: కేసీ కెనాల్ చైర్మన్ NTODAY NEWS: నంద్యాల జిల్లా ప్రతినిధి మల్లికార్జున మహానంది: మహిళల సాధికారతకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని నంద్యాల కేసీ కెనాల్ ప్రాజెక్టు చైర్మన్ బన్నూరు రామలింగారెడ్డి పేర్కొన్నారు. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని మహానంది మండలం గాజులపల్లె గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకురాలు శశికళ కొండారెడ్డి ఆధ్వర్యంలో ‘దీపం’ పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు, పొయ్యిలను పంపిణీ చేశారు. అనంతరం కేక్ కట్ చేసి ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బన్నూరు రామలింగారెడ్డి మాట్లాడుతూ మహిళల అభివృద్ధి, ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు మేలు చేసే పథకాలను మరింత విస్తృతంగా అమలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షురాలు బుడ్డారెడ్డి యశస్విని, తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ కంచర్ల శివయ్య, మండల క్లస్టర్ ఇంచార్జి నరాల చంద్రమౌళిశ్వర్ రెడ్డి, మండల యూనిట్ ఇన్చార్జి భాష్యం రాముడు గౌడ్, టిడిపి నాయకులు ఉల్లి మధు, పాశం శ్రీనివాసులు, హరి ప్రసాద్ రెడ్డి, గుద్దేటి నాగరాజు, గంగిశెట్టి మల్లికార్జున, రమాదేవి, మహిళలు తదితరులు పాల్గొన్నారు. #Mahanandi #WomenEmpowerment #DeepamScheme #Nandyal #KC Canal #AndhraPradesh Follow us on Website Facebook Instagram YouTube