www.ntodaynews.com
హైదరాబాద్లో టౌన్ ప్లానింగ్ అధికారిణి ఏసీబీ వలలో.. రూ.20 వేల లంచం తీసుకుంటూ పట్టివేత
తెలంగాణ
/
హైదరాబాద్
హైదరాబాద్లో టౌన్ ప్లానింగ్ అధికారిణి ఏసీబీ వలలో.. రూ.20 వేల లంచం తీసుకుంటూ పట్టివేత
హైదరాబాద్ సంతోష్నగర్లో టౌన్ ప్లానింగ్ అధికారిణి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. భవన నిర్మాణ అనుమతి మంజూరు చేసేందుకు రూ.20 వేల లంచం డిమాండ్ చేసినట్లు బాధితుడు ఏసీబీకి ఫిర్యాదు చేశాడు.
ఫిర్యాదు ఆధారంగా రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో వలపన్ని టౌన్ ప్లానింగ్ అధికారిణి సీహెచ్ ప్రభావతిని లంచం తీసుకుంటుండగా రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు.
అనంతరం ఆమెను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆదేశాల మేరకు జ్యుడీషియల్ రిమాండ్కు తరలించినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.