www.ntodaynews.com
హుజురాబాద్ మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ దాడి
తెలంగాణ
/
కరీంనగర్
/
కరీంనగర్ అర్బన్
హుజురాబాద్ మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ దాడి
లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అసిస్టెంట్ ఇంజనీర్
హుజురాబాద్
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మున్సిపల్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు.
ఈ దాడుల్లో అసిస్టెంట్ ఇంజనీర్ సుధాకర్ రెడ్డి ఒక కాంట్రాక్టర్ నుంచి రూ.50,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.
అధికారులు సుధాకర్ రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు సమాచారం. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.
అవినీతి చర్యలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీబీ అధికారులు పేర్కొన్నారు.