BREAKING
పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి
www.ntodaynews.com

మార్నింగ్ వాకింగ్‌తో ఆరోగ్యం

తెలంగాణ
09 Mar, 2026 - 08:46 AM
258 వీక్షణలు
మార్నింగ్ వాకింగ్‌తో ఆరోగ్యం – పరిశుభ్రతతో రోగాలకు చెక్ వన్ కే రన్‌ను ప్రారంభించిన చిట్యాల మున్సిపల్ చైర్మన్ పందిరి గీత NTODAY NEWS: చిట్యాల ప్రస్తుత కంప్యూటర్ యుగంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా జీవించాలంటే మార్నింగ్ వాకింగ్‌ను అలవాటు చేసుకోవాలని చిట్యాల మున్సిపల్ చైర్మన్ పందిరి గీత ప్రజలకు పిలుపునిచ్చారు. నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని చిట్యాల మున్సిపాలిటీ పట్టణ కేంద్రంలోని హైస్కూల్ సమీపంలోని వనిపాకల రోడ్డులో సోమవారం నిర్వహించిన వన్ కే రన్ ర్యాలీని ఆమె జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమం ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన పట్టణ ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ పందిరి గీత మాట్లాడుతూ ప్రస్తుత జీవనశైలిలో బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయని తెలిపారు. ప్రతిరోజూ ఉదయం మార్నింగ్ వాకింగ్ చేయడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని సూచించారు. ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా దోమల ద్వారా వ్యాపించే వ్యాధులను కూడా నివారించవచ్చని ఆమె తెలిపారు. కార్యక్రమంలో భాగంగా మూడో వార్డులో ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించి వీధుల్లో పేరుకుపోయిన చెత్తను మున్సిపల్ సిబ్బంది తొలగించారు. మూడో వార్డు వనిపాకల రోడ్డునుంచి శ్రీరామ్ నగర్ కాలనీ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించి ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ప్రతి పౌరుడు తన బాధ్యతగా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని చైర్మన్ కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గుండెబోయిన శ్రీలక్ష్మి, కమిషనర్ దండు శ్రీను, కౌన్సిలర్లు, అంగన్వాడీ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, ప్రజాప్రతినిధులు మరియు పట్టణ ప్రజలు పాల్గొన్నారు. #Chityal #MorningWalk #1KRun #CleanTown #PublicHealth #TelanganaNews #NTodayNews Follow us on Website Facebook Instagram YouTube