www.ntodaynews.com
విజయవాడలో రెచ్చిపోతున్న హిజ్రాలు
తెలంగాణ
విజయవాడలో రెచ్చిపోతున్న హిజ్రాలు
NTODAY NEWS: విజయవాడ
కొంతమంది హిజ్రాల ఆగడాలకు హద్దు లేకుండా పోతుంది. జుగుస్సకరంగా ప్రవర్తిస్తూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. శుభ, ఆశుభ కార్యం ఏదైనా సరే దందా మొదలుపెడతారు. గృహప్రవేశాలు పెళ్లిళ్లు, పుట్టినరోజు వేడుకలకు ఇలా కార్యక్రమం ఏదైనా సరే ఇండ్ల వద్దకు ఇట్టే వాలిపోతుంటారు. వేలకు వేలు డిమాండ్ చేసి ఇంటి యజమానులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. వారి ఆగడాలను తట్టుకోలేక సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బదులు పడుతున్నారు. ఈ సందర్భంగా హిజ్రాల దాడులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సోమవారం నగరంలో పలువురు ఆందోళనకు దిగారు. ఈ నెల 13వ తేదీన హిజ్రాల వేధింపులను తట్టుకోలేక సత్యకుమారి అనే మహిళ కూడా ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందింది. పోస్టుమార్టం అనంతరం సోమవారం నాడు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. దీంతో గిరిపురం సెంటర్ దగ్గర మృతదేహంతో మృతురాలి బంధువులు ఆందోళన చేపట్టారు. విజయవాడలో హిజ్రాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నడి రోడ్డుపై బైఠాయించారు. సమాచారం తెలుసుకున్న మాచవరం పోలీసులు, అక్కడికి చేరుకొని మృతురాలి బంధువులతో చర్చలు జరిపారు. వారిపై తగిన చర్యలు తాము తీసుకుంటామని పోలీసులు చెప్పడంతో ఆందోళన సద్దుమణిగింది. ఈ సందర్భంగా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న హిజ్రాలే టార్గెట్ గా కఠిన చర్యలు తీసుకోవడానికి పోలీసులు సిద్ధం అవుతున్నారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube