BREAKING
సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
Date of Publish : 03 January 2026, 08:43 am
Posted by : NTODAY NEWS OFFICIAL

పుట్టిన గడ్డపై తన ఆరాధ్య నాయకుడు

తెలంగాణ
03 Jan, 2026 - 08:43 AM
159 వీక్షణలు

పుట్టిన గడ్డపై తన ఆరాధ్య నాయకుడు

- పవన్ కళ్యాణ్ పర్యటనపై హరీష్ శంకర్ భావోద్వేగం NTODAY NEWS: జగిత్యాల అభిమాన నాయకుడు కళ్లముందే కనిపిస్తే కలిగే ఆనందం వేరే స్థాయిలో ఉంటుంది. చిన్నప్పటి నుంచి పెరిగిన గడ్డపై, తన ఆరాధ్య దైవం కొలువై ఉన్న క్షేత్రానికి తన హీరో రావడం, ఆయనతో కలిసి నడిచే అవకాశం దక్కడం ఒక అపూర్వ అనుభూతి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొండగట్టు పర్యటన సందర్భంగా ఒక అభిమాని పంచుకున్న భావోద్వేగపూరితమైన మాటలు ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. కల నిజమైన వేళ “నేను పుట్టి పెరిగిన ఈ గడ్డపై నా ప్రియమైన హీరో, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను చూడటం నా జీవితంలో మర్చిపోలేని అనుభూతి. ఆయనతో కలిసి ఆలయానికి వెళ్లడం కల నిజమైనట్టే అనిపిస్తోంది” అంటూ ఆ అభిమాని తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. కొండగట్టుకు మహర్దశ కేవలం పర్యటనకే పరిమితం కాకుండా, కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం అభివృద్ధి కోసం రూ. 35.19 కోట్ల నిధులతో తిరుమల తిరుపతి దేవస్థానాలు సహకారంతో సత్రం, దీక్షామండప నిర్మాణాలకు శ్రీకారం చుట్టడంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ అభివృద్ధికి పవన్ కళ్యాణ్ చూపిన చొరవను కొనియాడుతూ, ఈ మార్పులకు తాము సాక్షులుగా నిలవడం గర్వంగా ఉందని పేర్కొన్నారు. “నా ఆరాధ్య నాయకుడు పవన్ కళ్యాణ్ మా ప్రాంతానికి రావడం, ఆయనతో కలిసి ఆలయ సందర్శన చేయడం నిజంగా అపురూపమైన గౌరవం. కొండగట్టు అంజనేయ ఆలయ అభివృద్ధికి ఆయన చేసిన కృషికి ఎప్పటికీ రుణపడి ఉంటాం” అని అభిమాని అన్నారు. ముఖ్యాంశాలు -కొండగట్టు అంజనేయ ఆలయ అభివృద్ధి పనుల శంకుస్థాపన -పవన్ కళ్యాణ్‌కు ఘన స్వాగతం, భక్తుల కోలాహలం -టీటీడీ సహకారంతో రూ. 35.19 కోట్లతో నూతన నిర్మాణాలు Follow us on Website Facebook Instagram YouTube