BREAKING
హుస్సేన్ సాగర్ లో యువతి మృతదేహం లభ్యం పుంగనూరు టమోటా ధరలు క్రమంగా తగ్గుముఖం మన శరీరం ఎంత ఉష్ణోగ్రతను తట్టుకుంటుంది..? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా పర్యటన మియాజాకి మామిడిపండును యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కు బహుకరించిన రైతు ఘనంగా రాజా రామ్మోహన్ రాయ్ జయంతి వేడుకలు ఎండలో ఉపాధి కూలీలకు చల్లని ఊరట.. పుంగనూరు మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ హాజీ పి. వాహీదున్నిసా హఠాన్మరణం.. లాటరీ పేరుతో ప్రజల జేబుకి చిల్లులు..కుటుంబాలు చిన్న భిన్నం దళితవాడలకు మౌలిక వసతులు కల్పించాలి: ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం హుస్సేన్ సాగర్ లో యువతి మృతదేహం లభ్యం పుంగనూరు టమోటా ధరలు క్రమంగా తగ్గుముఖం మన శరీరం ఎంత ఉష్ణోగ్రతను తట్టుకుంటుంది..? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా పర్యటన మియాజాకి మామిడిపండును యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కు బహుకరించిన రైతు ఘనంగా రాజా రామ్మోహన్ రాయ్ జయంతి వేడుకలు ఎండలో ఉపాధి కూలీలకు చల్లని ఊరట.. పుంగనూరు మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ హాజీ పి. వాహీదున్నిసా హఠాన్మరణం.. లాటరీ పేరుతో ప్రజల జేబుకి చిల్లులు..కుటుంబాలు చిన్న భిన్నం దళితవాడలకు మౌలిక వసతులు కల్పించాలి: ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం
www.ntodaynews.com

IAS అధికారులు అయినా రిజర్వేషన్ ఎందుకు..? సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 May, 2026 - 07:22 PM
26 వీక్షణలు

తల్లిదండ్రులు ఐఏఎస్ అధికారులు వంటి ఉన్నత పదవుల్లో ఉన్నప్పుడు వారి పిల్లలకు రిజర్వేషన్ ప్రయోజనాలు ఎందుకు కల్పించాలంటూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వెనుకబడిన తరగతుల్లో ఆర్థికంగా, సామాజికంగా ఇప్పటికే ఉన్నత స్థితికి చేరుకున్న కుటుంబాలకు రిజర్వేషన్ వర్తింపుపై విచారణ సందర్భంగా ఈ అభిప్రాయం వెల్లడించింది.

“సామాజికంగా, ఆర్థికంగా ముందంజలో ఉన్న వారికి రిజర్వేషన్ ప్రయోజనాలు కొనసాగించడం సరైంది కాదు. నిజంగా వెనుకబడిన వారికి అవకాశాలు చేరాలి” అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

ఇప్పటికే ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో ఉన్నత స్థితికి చేరుకున్న వర్గాలను రిజర్వేషన్ ప్రయోజనాల నుంచి తప్పించాలని పేర్కొన్నప్పటికీ, వాటిని కొందరు సవాల్ చేస్తున్నారని కోర్టు తెలిపింది. అలాంటి వారిని రిజర్వేషన్ పరిధి నుంచి మినహాయించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది.