IAS అధికారులు అయినా రిజర్వేషన్ ఎందుకు..? సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
తల్లిదండ్రులు ఐఏఎస్ అధికారులు వంటి ఉన్నత పదవుల్లో ఉన్నప్పుడు వారి పిల్లలకు రిజర్వేషన్ ప్రయోజనాలు ఎందుకు కల్పించాలంటూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వెనుకబడిన తరగతుల్లో ఆర్థికంగా, సామాజికంగా ఇప్పటికే ఉన్నత స్థితికి చేరుకున్న కుటుంబాలకు రిజర్వేషన్ వర్తింపుపై విచారణ సందర్భంగా ఈ అభిప్రాయం వెల్లడించింది.
“సామాజికంగా, ఆర్థికంగా ముందంజలో ఉన్న వారికి రిజర్వేషన్ ప్రయోజనాలు కొనసాగించడం సరైంది కాదు. నిజంగా వెనుకబడిన వారికి అవకాశాలు చేరాలి” అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
ఇప్పటికే ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో ఉన్నత స్థితికి చేరుకున్న వర్గాలను రిజర్వేషన్ ప్రయోజనాల నుంచి తప్పించాలని పేర్కొన్నప్పటికీ, వాటిని కొందరు సవాల్ చేస్తున్నారని కోర్టు తెలిపింది. అలాంటి వారిని రిజర్వేషన్ పరిధి నుంచి మినహాయించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది.