ఇబ్రహీంపట్నంలో ఘనంగా జోగి కుటుంబ వేడుకలు పాల్గొన్న కుప్పిరెడ్డి వెంకట రెడ్డి
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్ సతీమణి శకుంతలాదేవి పుట్టినరోజు, అలాగే జోగి రాము–నాగలక్ష్మి దంపతుల వివాహ వార్షికోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.
ఈ కార్యక్రమంలో రెడ్డిగూడెం మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కుప్పిరెడ్డి వెంకటరెడ్డి, చాట్ల రాబర్ట్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని జోగి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. పుష్పగుచ్ఛాలు అందజేసి జన్మదిన, వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా కుప్పిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ, మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబం ప్రజలతో ఎల్లప్పుడూ ఆత్మీయ అనుబంధం కలిగి ఉందని అన్నారు. శకుంతలాదేవికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, జోగి రాము–నాగలక్ష్మి దంపతులు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. కుటుంబ విలువలను, బంధాలను చాటిచెప్పే ఇలాంటి వేడుకలు అందరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
ఆత్మీయ వాతావరణంలో జరిగిన ఈ వేడుకల్లో పాల్గొన్న నాయకులు, అభిమానులు జోగి కుటుంబ సభ్యులతో కలిసి ఆనందాన్ని పంచుకుని, దంపతుల ఉజ్వల భవిష్యత్తు కోసం శుభాకాంక్షలు తెలిపారు.