ఇంద్రపాలనగరంను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలి
శిధిలావస్థకు చేరిన చెరువు తూములను మరమ్మత్తు చేయాలిసిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్
చారిత్రత్మాక గ్రామమైన ఇంద్రపాలనగరంను పర్యాటక కేంద్రంగా మార్చి శిథిలావస్థకు చేరిన చెరువు తూములను మరమ్మత్తు చేయాలని సిపిఎం యాదాద్రి జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఎం పోరుయాత్రలో భాగంగా ఇంద్రపాలనగరంలో గ్రామ శాఖ నాయకత్వంతో కలిసి పలు సమస్యలను పరిశీలన చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రీ.శ ఆరవ శతాబ్దంలో విష్ణుకుండ్యుల రాజధానిగా చేసుకొని పాలించిన చారిత్రాత్మక ప్రదేశం నేడు నిరాధారణకు గురై పాలకుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా నెలకొన్నదని అన్నారు. నాలుగు దశబ్దాలుగా ఉప్పునూతల పురుషోత్తం రెడ్డి హయాం నుండి ఇంద్రపాలనగరంను పర్యాటక కేంద్రంగా మారుస్తామని హామీ ఇస్తూ అమలుకు నోచుకోకుండా పోతుందని ఇతర ప్రాంతాల నుండి పర్యాటకులు వస్తే కనీసం మంచినీటి సౌకర్యం కూడా లేదని వాపోయారు. నాటి పురాతన ప్రతిమలన్నీ శిధిలమై గుర్తుతెలియని వ్యక్తుల తవ్వకాలతో ధ్వంసమైపోతున్నాయని పురావస్తు శాఖ చొరవ తీసుకొని వీటిని పరిరక్షించి, పర్యారకులకు కాటేజీలు ఏర్పాటు చేసి గ్రామానికి రెవిన్యూ పెంచాలని ప్రభుత్వం వెంటనే పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసి సౌకర్యాలు కల్పించాలని అదేవిధంగా శిధిలావస్థకు చేరిన చెరువు తూములను వెంటనే మరమ్మత్తు చేయాలని గత కాలం నుండి ప్రమాదకరంగా ఉండి ఇద్దరు మరణించడం జరిగిందని చెరువుకు ప్రధాన తోము కావడంతో రైతులు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మరమ్మతులు చేసి వెంటనే సమస్య పరిష్కరించాలని అన్నారు. గ్రామంలో నెలకొన్న సమస్యలపై అధికారులు ప్రత్యేక చొరవ చూపించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు జల్లెల పెంటయ్య,మండల కమిటీ సభ్యులు మీర్ ఖాజా అలీ, శాఖ కార్యదర్శి గన్నెబోయిన శ్రీనివాస్, కొంగరి నర్సింహా, నాయకులు కొమ్మగోని అశోక్, భువనగిరి అశోక్, నాగు నర్సింహా, రాదారపు మల్లేశం తదితరులు పాల్గొన్నారు.