BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

ఇంటికి తాళం వేసి ఊరు వెళ్తున్నారా..? ముందుగా పోలీసులకు చెప్పండి.. లేదంటే దొంగల టార్గెట్ అయ్యే ప్రమాదం!

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
13 May, 2026 - 08:32 AM
183 వీక్షణలు

NTODAY NEWS చాట్రాయి:

ఇంటికి తాళం వేసి వెళ్లిపోతే.. దొంగలకు ఆహ్వానం పలికినట్టే” అంటూ చాట్రాయి ఎస్ఐ డి. రామకృష్ణ ప్రజలను అప్రమత్తం చేశారు. మండలంలో వరుస దొంగతనాలను అరికట్టేందుకు పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసిన నేపథ్యంలో, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

మంగళవారం ఎర్రవారి గూడెం, కొత్తగూడెం, సోమవరం గ్రామాల్లో మైక్ అనౌన్స్‌మెంట్ నిర్వహించిన ఎస్ఐ రామకృష్ణ.. ఇంటికి తాళం వేసి ఊరు వెళ్లే వారు తప్పనిసరిగా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని స్పష్టం చేశారు. “తాళం వేసి ఉన్న ఇళ్లపైనే దొంగల కన్ను ఎక్కువగా ఉంటుంది. ఒక చిన్న నిర్లక్ష్యం జీవితకాల కష్టార్జితాన్ని పోగొట్టే ప్రమాదం ఉంది” అని హెచ్చరించారు.

ఇరుగు పొరుగు వారికి సమాచారం ఇవ్వడం, ఇంటి చుట్టూ లైట్లు ఆన్‌లో ఉంచడం, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గ్రామాల్లో కొత్తగా కనిపించే వ్యక్తులు, పాత సామాన్లు కొనుగోలు చేసే వారు, సేల్స్‌మెన్ ముసుగులో తిరిగే అనుమానాస్పద వ్యక్తులపై ప్రత్యేక నిఘా పెట్టాలని కోరారు.

“ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే ఆలస్యం చేయకుండా వెంటనే డయల్ 112కు సమాచారం ఇవ్వండి. మీ ఒక్క ఫోన్ కాల్ పెద్ద నేరాన్ని అడ్డుకోవచ్చు” అని ఎస్ఐ తెలిపారు.

రాత్రి వేళల్లో కిటికీల దగ్గర నిద్రించే వారు బంగారు గొలుసులు, నగలు ధరించవద్దని, నగదు, బంగారం వంటి విలువైన వస్తువులను బీరువాల్లో భద్రపరుచుకోవాలని సూచించారు.

గ్రామాల్లో రాత్రిపూట పోలీస్ గస్తీని మరింత కట్టుదిట్టం చేశామని, ప్రజల భద్రత కోసం పోలీసులు 24 గంటలు అప్రమత్తంగా ఉన్నారని ఎస్ఐ రామకృష్ణ వెల్లడించారు. “ప్రజల సహకారంతో చాట్రాయిని నేర రహిత మండలంగా తీర్చిదిద్దుతాం” అని ధీమా వ్యక్తం చేశారు.