ఇన్స్టా పరిచయం... ప్రాణాంతక ప్రేమ!
ఇన్స్టా పరిచయం... ప్రాణాంతక ప్రేమ!
ఏలూరు జిల్లా ఉంగుటూరులో విషాదం చోటుచేసుకుంది. సోషల్ మీడియా ద్వారా పరిచయమైన యువకుడు, వివాహిత మధ్య పెరిగిన అనుబంధం చివరకు ఆత్మహత్యతో ముగిసింది.
ఉంగుటూరుకు చెందిన మావుళ్లయ్య (24)కు, శ్రీకాకుళం జిల్లాకు చెందిన రమ (34)కు ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం క్రమంగా ప్రేమగా మారి, ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం కొనసాగింది.
ఈ నెల 24న రమ శ్రీకాకుళం నుంచి ఉంగుటూరుకు చేరుకుంది. అనంతరం ఇద్దరూ వివాహం చేసుకున్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న రమ భర్త తీవ్రంగా మందలించడంతో మనస్తాపానికి గురైన ఈ జంట అదే రోజు సమీప కాలువలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది.
సమాచారం అందుకున్న పోలీసులు గాలింపు చేపట్టి, నిన్న ఇద్దరి మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది.