BREAKING
తప్పిపోయిన వృద్ధ మహిళను కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు పలమనేరు–బెంగళూరు హైవేపై రోడ్డు ప్రమాదం ఎల్కతుర్తిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం లబ్ధిదారులకు పెన్షన్లు అందచేసిన కమిషనర్ NHAI అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష కశిoకోట RECS పాలిటెక్నిక్ కళశాల టీచర్లు రేలే నిరాహార దీక్ష సెప్టెంబర్ 1.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో చిరస్మరణీయమైన రోజు కాగిత రామచంద్రపురం గ్రామ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి హానరరీ డాక్టర్ ప్రధానం వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ తప్పిపోయిన వృద్ధ మహిళను కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు పలమనేరు–బెంగళూరు హైవేపై రోడ్డు ప్రమాదం ఎల్కతుర్తిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం లబ్ధిదారులకు పెన్షన్లు అందచేసిన కమిషనర్ NHAI అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష కశిoకోట RECS పాలిటెక్నిక్ కళశాల టీచర్లు రేలే నిరాహార దీక్ష సెప్టెంబర్ 1.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో చిరస్మరణీయమైన రోజు కాగిత రామచంద్రపురం గ్రామ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి హానరరీ డాక్టర్ ప్రధానం వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ
Date of Publish : 09 March 2026, 02:49 am
Posted by : NTODAY NEWS OFFICIAL

ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

తెలంగాణ
09 Mar, 2026 - 02:49 AM
334 వీక్షణలు
సీఆర్ఆర్ కళాశాలలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు మహిళల ఆర్థికాభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది NTODAY NEWS: ఏలూరు జిల్లా ప్రతినిధి కళ్యాణ్ కుమార్ ఏలూరులోని సర్ సీఆర్ఆర్ డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, నగర మేయర్ షేక్ నూర్జహాన్, జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివ కిషోర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి మాట్లాడుతూ మహిళల భద్రత, శాంతి భద్రతల విషయంలో ఎటువంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. మహిళల భద్రత ప్రభుత్వ బాధ్యత అని పేర్కొంటూ, మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ మహిళల ఆర్థిక, సామాజికాభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాయని తెలిపారు. జిల్లాలో కీలక పదవుల్లో మహిళలు ముందుండి పనిచేయడం శుభపరిణామమని పేర్కొన్నారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ కుటుంబం నుంచి సమాజం వరకు అన్ని రంగాల్లో మహిళలు సమర్థవంతంగా తమ పాత్రను పోషిస్తున్నారని అన్నారు. మహిళలకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. నగర మేయర్ షేక్ నూర్జహాన్ మాట్లాడుతూ పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో ఉన్నారని చెప్పారు. ఈ సందర్భంగా స్వయం సహాయక సంఘాల మహిళలకు రూ.245 కోట్ల 42 లక్షల బ్యాంక్ లింకేజ్ రుణాలను అందజేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ శాఖల మహిళా అధికారులు, ఉద్యోగులను కలెక్టర్ వెట్రి సెల్వి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు మరియు మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. #InternationalWomensDay #Eluru #CRRCollege #WomenEmpowerment #AndhraPradeshNews #NTodayNews Follow us on Website Facebook Instagram YouTube